న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పట్టణాల్లో వినియోగిస్తున్న పాలలో 68% వరకు భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రమాణాలకు అనుగుణంగా లేనివేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇందులో 66% వరకు విడిగా(లూజ్) అమ్మే పాలేనని ఎఫ్ఎస్ఎస్ఏఐ 2011లో జరిపిన సర్వేలో తేలినట్లు పేర్కొంది. కల్తీ, సింథటిక్ పాలతో పాటు పలు డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను అరికట్టాలన్న కొందరి పిటిషన్ నేపథ్యంలో.. సుప్రీం నోటీసుతో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. పాలను నీటితో కల్తీ చేయడమనేది సర్వ సాధారణ ప్రక్రియగా ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్వే పేర్కొంది. పాలపొడితో పాటు గ్లూకోజ్ను కలపడం ప్రమాణాలు లోపించడానికి ప్రధాన కారణమంది. డిటర్జెంట్ కలుపుతున్నట్లు తనిఖీలో తేలిందని వివరించింది. గ్రామాల్లో 83% వరకు లూజ్ పాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవని తెలిపింది.
No comments:
Post a Comment