Friday, October 5, 2012

ఆలూ, పెప్పర్ కర్రీ

కావలసినవి


బంగాళా దుంపలు ......................... 25- గ్రా.

ఉల్లిపాయ ....................................... 1

పచ్చిమిర్చి ....................................... 3

పసుపు ............................................ 1/4 టీ.స్పూ.

కరివేపాకు ....................................... 1 రెబ్బ

అల్లం వెల్లుల్లి ముద్ద ........................ 1/2 టీ.స్పూ.

మిరియాల పొడి .......................... 1/2 టీ.స్పూ.

ఉప్పు .............................................. తగినంత

నూనె ............................................... 2 టీ.స్పూ.

వండే విధం

బంగాళా దుంపలు చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తబడేవరకు వేయించుకోవాలి. ఇందులో కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి నిలువుగా తరిగి వేసి కొద్దిసేపు వేపాలి. తర్వాత అల్లం వెల్లుల్లి వేసి కలిపి బంగాళా దుంప ముక్కలు, తగినంత ఉప్పువేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత కప్పుడు నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. గరిటతో కొద్దిగా మెదిపి మిరియాల పొడి వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించి కొత్తిమీర చల్లి దింపేయాలి. ఈ కూర అన్నం కంటే పూరీ, చపాతీ, దోశలకు బావుంటుంది.

No comments: