తెలుగు మహాసభలకు తిరుపతి వేదిక కానుంది. డిసెంబర్ 27 నుంచి 29 వరకు ఈ సభలు నిర్వహించనున్నారు. దీని కోసం ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను ఖర్చుచేయనుంది. రాష్ట్ర మంత్రుల బృందం సభాస్థలాన్ని పరిశీలించింది. అనంతరం తిరుపతి పద్మావతి అతిథిగృహంలో సభలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తెలుగు మహాసభల్లో అన్ని ప్రభుత్వ శాఖలు పాలుపంచుకోనున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ తెలిపారు.
No comments:
Post a Comment