మైదా .................................250 గ్రా.
డాల్టా లేదా వెన్న .............. 3 టీ.స్పూ.
పెరుగు ............................ 100 గ్రా.
వంటసోడా ........................ చిటికెడు
ఉప్పు ............................... చిటికెడు
చక్కెర ............................. 500 గ్రా.
యాలకుల పొడి ............1/2 టీ.స్పూ.
నూనె .........................వేయించడానికి
ఇలా చేయాలి
డాల్టా లేదా వెన్న .............. 3 టీ.స్పూ.
పెరుగు ............................ 100 గ్రా.
వంటసోడా ........................ చిటికెడు
ఉప్పు ............................... చిటికెడు
చక్కెర ............................. 500 గ్రా.
యాలకుల పొడి ............1/2 టీ.స్పూ.
నూనె .........................వేయించడానికి
ఇలా చేయాలి
మైదాలో ఉప్పు, సోడా వేసి జల్లించాలి. ఇందులో కరిగించిన డాల్టా లేదా వెన్న లేదా నెయ్యి వేసి కలపాలి. తర్వాత పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా తడిపి ఒక గంట నాననివ్వాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజులో ముద్దలా చేసుకుని కొద్దిగా వెడల్పు చేసి మధ్యలో వేలితో గుంతలా చేయాలి. ఇలా చేసుకున్నవి వేడి నూనెలో నిదానంగా బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి.
పక్కన చక్కెరలో అర కప్పు నీళ్లు పోసి తీగ పాకం వచ్చేలా మరిగించి యాలకుల పొడి కలిపి మూత పెట్టి ఉంచాలి. వేయించిన బాదుషాలను ఈ పాకంలో వేసి పది నిమిషాలు నాననిచ్చి తీసి, విడిగా ప్లేట్లో పెట్టుకోవాలి.
No comments:
Post a Comment