Tuesday, October 23, 2012

తెలుగులో జీవో జారీ

రాష్ట్ర ప్రభుత్వం తెలుగులో జీవో జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ తెలుగులో జీవో జారీ చేశారు. అలాగే సంఘం సభ్యులుగా డాక్టర్ టి.గౌరీశంకర్, అయ్యాల సోమయాజుల గోపాలరావు, యన్.ఆర్.వెంకటేశం, వేంపల్లి అబ్దుల్ ఖాదర్‌లను నియమించారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి సంఘం కాలపరిమితిని రెండు సంవత్సరాలుగా నిర్ణయించారు. అధికార భాషా వ్యవహారాలు చూసే అదనపు లేదా సంయుక్త లేదా ఉప కార్యదర్శి హోదాలో ఉన్న అధికారి సంఘం కార్యదర్శిగా వ్యవహరిస్తారు.

No comments: