భారత్లోని వినియోగదారులకు గూగుల్ సంస్థ మరో నూతన సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. జీమెయిల్ నుంచి ఉచితంగా ఏ మొబైల్కైనా ఎస్సెమ్మెస్ పంపే సదుపాయం ఈ నెల 10 నుంచి కల్పించింది. భారత్లో ప్రధాన టెలికాం నెట్వర్క్లు.. ఎయిర్టెల్, ఐడియా, లూప్ మొబైల్, ఎంటీస్, రిలయన్స్, టాటా డొకోమో, టాటా ఇండికాం, ఒడాఫోన్ వినియోగదారులకు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. అయితే ఒక జీమెయిల్ అకౌంట్నుంచి రోజుకు 50 మెస్సేజ్లు మాత్రమే పంపే వీలుంది. 50 పూర్తయిపోతే.. 24 గంటల తర్వాత మరో 50 మెస్సేజ్లు అందుబాటులోకి వస్తాయి.
No comments:
Post a Comment