Saturday, October 6, 2012

గృహహింసలో ఎన్నారైలు ఫస్ట్: రంజనా కలె

గృహహింసలో ప్రవాస భారతీయులే(ఎన్‌ఆర్‌ఐలు) ముందున్నారని ప్రవాస భారతీయ మంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారు రంజనా కలె పేర్కొన్నారు. ‘ప్రవాస భారతీయుల పెళ్లిళ్లు’ అనే అంశంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని సీవీ రామన్ ఆడిటోరియంలో శనివారం జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కలె మాట్లాడుతూ కుమార్తె భవిష్యత్ బాగుంటుందనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఎన్‌ఆర్‌ఐ వరుల పట్ల ఆసక్తి చూపుతున్నారని, అయితే వారి మైండ్‌సెట్ మారాల్సిన అవసరముందన్నారు.





1 comment:

Praveen Mandangi said...

డబ్బున్న సంబంధం దొరికితే అది మంచి సంబంధం అనుకుని అమ్మాయికి పదహారేళ్ళ వయసు ఉన్నా పెళ్ళి చేసే తల్లితండ్రులు ఉన్నప్పుడు NRI తరహా మోసాలు ఎందుకు జరగవు?