Thursday, October 11, 2012

అమ్మవారి ఆలయంలో దొంగలు

రాష్ట్రంలో దొంగలు రోజురోజుకీ విజృంభిస్తున్నారు. వరుస దొంగతనాలతో విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఇల్లు, బడి, గుడి అనే బేధం లేకుండా అన్నిచోట్లా చోరీలకు పాల్పడుతున్నారు. పాపభీతి లేకుండా దేవుళ్లను నిలువునా దోచేస్తున్నారు. ఇలవేల్పులనూ వదలడం లేదు. తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పాతబస్తీలోని చారిత్రక లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో దొంగలు తెగబడ్డారు. మంగళవారం రాత్రి-అక్టోబర్ 9న అమ్మవారి ఆలయ తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడిన ఆగంతకులు సుమారు 20 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అమ్మవారి వజ్రపు బొట్టుతో సహా దాదాపు 10 కిలోల వెండి, 6 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి

No comments: