చిత్తూరు జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున చెన్నై- కావేరీ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. మైసూరు నుంచి చెన్నై వెళుతున్న కావేరీ ఎక్స్ప్రెస్ కుప్పం మండలం మల్లానూరు పులికొండ వద్ద ఈరోజు ఉదయం నాలుగు గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. రైల్వే ట్రాక్ పై కొండ చరియలు పడటంతో ఇంజన్ భాగం దెబ్బతింది. ఆరు బోగీలకు ఇంజన్ తో లింకు తెగిపోయింది. ట్రాక్ పై బోగీలు ఒరిగిపోవటంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
కాగా ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులను మల్లనూరు రైల్వేస్టేషన్ కు తరలించారు. వీరిని ప్రత్యేక రైలులో చెన్నైకి చేర్చేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో బెంగళూరు నుంచి చెన్నై వెళ్లే అన్ని రైళ్లు రద్దయ్యాయి. కాగా చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
కాగా ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులను మల్లనూరు రైల్వేస్టేషన్ కు తరలించారు. వీరిని ప్రత్యేక రైలులో చెన్నైకి చేర్చేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో బెంగళూరు నుంచి చెన్నై వెళ్లే అన్ని రైళ్లు రద్దయ్యాయి. కాగా చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
No comments:
Post a Comment