హైదరాబాద్: రాష్ట్రీయ లోకదళ్ (ఆర్ఎల్డీ) తెలంగాణ శాఖను కేంద్రమంత్రి అజిత్సింగ్ ప్రకటించారు. ఆర్ఎల్డీ తెలంగాణ శాఖ కన్వీనర్గా కపిలవాయి ఇందిరాదిలీప్ ను, వర్కింగ్ ప్రెసిడెంట్గా మహ్మద్ రియాజ్ ను నియమించారు. ఈ సందర్భంగా అజిత్ సింగ్ మాట్లాడుతూ... తెలంగాణకు మద్దతు తెలపకపోతే గ్రామాల్లో తిరిగే పరిస్థితి తెలంగాణలో లేదు అని అన్నారు. 'తెలంగాణలాంటి ఉద్యమాన్ని నేనెక్కడా చూడలేదు' అని అజిత్సింగ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని అజిత్సింగ్ అన్నారు. 2003 నుండి తెలంగాణ గురించి నేను ఈ ప్రాంత ప్రజలతో మమేకమై వారి మనోభావాన్ని గుర్తిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి వారి ఆకాంక్షను గౌరవించాల్సిన అవసరం ఉందని తెలియజేసారు. రాజకీయ మద్దత్తుతోనే తెలంగాణ వస్తుందని అందుకోసం రాబోయే ప్రతి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ పోటి చేస్తుందని తెలియజేసారు.
No comments:
Post a Comment