Sunday, October 21, 2012

నవరాత్రి వంటలు..........కట్టె పొంగలి

బియ్యం - 250 గ్రా.

పెసరపప్పు - 100 గ్రా.

మిరియాలు

- 1/2 టీ.స్పూ.

జీలకర్ర - 1 టీ.స్పూ.

కరివేపాకు - 2 రెబ్బలు

ఉప్పు - తగినంత

నెయ్యి - 4 టీ.స్పూ.

నూనె - 3 టీ.స్పూ.

ఇంగువ - చిటికెడు

పచ్చిమిర్చి - 2

ఇలా చేద్దాం

బియ్యం, పెసరపప్పు కలిపి కడిగి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. ఒక గినె్నలో నూనె, సగం నెయ్యి వేడి చేసి ఇంగువ వేయాలి. అది కరిగిన తర్వాత జీలకర్ర, మిరియాలు వేసి దోరగా వేగిన తర్వాత కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేపి, మూడు గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి. ఇందులో తగినంత ఉప్పు వేయాలి.

నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం, పప్పు నీళ్లనుండి తీసి వేసి మెత్తగా ఉడికించాలి. చివరిలో మిగిలిన నెయ్యి వేసి దింపేయాలి.

No comments: