ఉస్మానియా పరిధిలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న రెగ్యులర్, దూరవిద్యా కేంద్రంలో బీఏ, బీకాం(కంప్యూటర్స్/జనరల్), బీఎస్సీ, బీబీఏ కోర్సుల ప్రథమ, ద్వితీయ,తృతీయ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 26 వరకు ఆయా కళాశాలల్లో ఫీజు చెల్లించాలని కంట్రోలర్ ప్రొ.భిక్షమయ్య తెలిపారు. రూ.100 అపరాధ రుసుముతో డిసెంబర్ 31 వరకు ఫీజు చెల్లించాలన్నారు. ఫీజు చెల్లించు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారానే ఓయూ పరీక్షల నియంత్రణ కేంద్రానికి అందజేయాలన్నారు.
No comments:
Post a Comment