Wednesday, November 7, 2012

కోర్స్ ఇన్ఫో: బయోటెక్నాలజీ

పరీక్షలివీ..
జేఎన్‌యూ కంబైన్డ్ బయోటెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్: దేశంలోని సెంట్రల్, ప్రముఖ యూనివర్సిటీల్లో బయోటెక్నాలజీలో పీజీ చేయాలంటే ఈ పరీక్ష రాయాల్సిందే. ఈ యూనివర్సిటీల్లో సీటు పొందినవారికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ నెలకు రూ.800 స్టైపెండ్ కూడా అందిస్తోంది.

ఐఐటీల్లోనూ: జామ్ పరీక్ష ద్వారా ఐఐటీల్లో బయోటెక్నాలజీ కోర్సుకు ప్రవేశం లభిస్తుంది. ప్రస్తుతం రెండు ఐఐటీలు ఈ కోర్సు అందిస్తున్నాయి.
ఐఐటీ-రూర్కీ ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఐఐటీ-బాంబే ఎంఎస్సీ బయోటెక్నాలజీతోపాటు ఎంఎస్సీ పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ కోర్సు అందిస్తోంది.

మన రాష్ట్రంలో:
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం, ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి, కాకతీయ యూనివర్సిటీ-వరంగల్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ-గుంటూరు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ-అనంతపురంతో పాటు వివిధ ప్రైవేటు పీజీ కాలేజీలు.

అర్హత: డిగ్రీలో బయాలజీ/ ఫిజికల్ సెన్సైస్ కోర్సులు చదివుండాలి.

స్పెషలైజేషన్లు: ప్లాంట్ బయోటెక్నాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, మెరైన్ బయోటెక్నాలజీ, క్లినికల్ బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ.

ఎంబీఏ/పీజీడీఎం (బయోటెక్నాలజీ):
పుణె యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్
ఎంటర్‌ప్రైజ్-హైదరాబాద్, ఎస్‌ఐఈఎస్ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్-ముంబై, భారతీ విద్యాపీఠ్ యూనివర్సిటీ-పుణె, పంజాబ్ యూనివర్సిటీ-చండీగఢ్, అమిటీ యూనివర్సిటీ-నోయిడా, మిట్‌కాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-పుణె

No comments: