Tuesday, November 27, 2012

Education play key role.....

 
ఉత్తమ విద్య మనిషిని సంస్కారవంతంగా, సమర్థుడిగా తయారు చేస్తుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి చెప్పారు. ఇది ఉన్నత మార్గానికి సోపానమవుతుందని అభిప్రాయపడ్డారు. మంగళవారం కేశవ మెమోరియల్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆంద్రాబ్యాంక్ 90వ వ్యవస్థాపక దినోత్సవానికి జస్టిస్ నరసింహారెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఆంధ్రాబ్యాంక్ జీఎం ప్రసన్న ఫణికర్ చేతుల మీదుగా 350మంది విద్యార్థులకు టీషర్ట్‌లు పంపిణీ చేశారు. ఎన్‌సీసీ నేషనల్ ట్రెక్కింగ్ శిబిరానికి ఎంపికైన వంశీ, అజయ్‌లను అభినందించారు. కేశవ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెరైక్టర్ నీల్‌గోక్టే, కేశవ మెమోరియల్ విద్యాసంస్థల వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు జె.నరసింహరావు, సహాయ కార్యదర్శి భావన్నారాయణ తదితరులు ప్రసంగించారు.

No comments: