Thursday, November 1, 2012

చలికాలం... చర్మం పొడిబారుతోంది...

పొడిచర్మం గలవారికి చలికాలం సమస్యగానే ఉంటుంది. చలి కాబట్టి దాహం కూడా తక్కువే. అందుకే తక్కువ నీళ్లు తాగుతారు. దీంతో ఒంట్లో నీటి శాతం తగ్గిపోతుంది. ఫలితంగా చర్మం ఇంకా పొడిబారుతుంది. అందుకని ఈ కాలం నీళ్లు ఎక్కువ తాగడానికి ప్రయ త్నించండి. కనీసం 2-5 లీటర్ల నీళ్లు తాగండి. ప్రతి మూడు గంటలకు ఒకసారి మాయిశ్చరైజర్‌ని రాసు కోవాలి. అయితే కోల్డ్‌క్రీమ్... మొటిమలు, యాక్నేకు కారణం కావచ్చు. అందుకని క్రీమ్ రాసుకోవడానికి ముందుగా ముఖాన్ని, చేతులను శుభ్రపరుచుకోవడం మరచిపోవద్దు. ఇంకా వారానికి ఒకసారి బాగా మగ్గిన అరటిపండు గుజ్జు తో ముఖాన్ని, చేతులను మసాజ్ చేసుకోవాలి. అలాగే ఆలివ్ ఆయిల్ కలిపిన పెరుగుతో వారానికి ఒకసారి శరీరాన్ని మసాజ్ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలం ఈ సమస్య బాధించదు.

No comments: