బిడ్డింగ్ ద్వారా వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ను కొనుగోలు చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి మృత్యుంజయ్ సాహు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 2013 కంటే ముందుగా 1,000 మెగావాట్లు వచ్చేలా డిస్కంలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిస్కంలు సూచించిన ప్రాంతాల్లో ప్లాంటును ఏర్పాటు చేయడంతోపాటు బిడ్డింగ్లో తక్కువ ధరను కోట్ చేసిన సంస్థల నుంచి విద్యుత్ను కొనుగోలు చేయాలని డిస్కంలను ఆదేశించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించిన ధర కంటే డెవలపర్లు ఎక్కువ ధరను పేర్కొంటే... ఆ మొత్తాన్ని పరిశ్రమల నుంచి వసూలు చేసుకోవాలని ఇంధనశాఖ సూచించింది. పరిశ్రమలు ముందుకురాని పక్షంలో ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొంది.
No comments:
Post a Comment