ఎంత ప్రయత్నించినా.. అనవసరపు, చెడు, నెగెటివ్ ఆలోచనలను మాత్రం దూరం పెట్టలేకపోతున్నారా? అయితే, వాటిని ఓ కాగితంపై రాసి ముక్కముక్కలుగా చించి పారేయండి. అలా చేస్తే అనవసర ఆలోచనలు తప్పకుండా దూరం అవుతాయంటున్నారు ఓహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు. ఆలోచనలను మనసులో అట్టే పెట్టుకోవడం కంటే, వాటిని కాగితంపై రాసి చించిపారేయడం వల్ల ఆ ఆలోచనలను మనం ఉపయోగించే పద్ధతిలో కొంచెం తేడా ఉంటుందని వారు వెల్లడించారు. ఇలాంటి పద్ధతిని ఉపయోగించి చేసే కొన్ని రకాల మానసిక చికిత్సలు మంచి ఫలితాలను ఇస్తాయని వర్సిటీ ప్రొఫెసర్ రిచర్డ్ పెట్టీ తెలిపారు. మనం మన ఆలోచనలను ఎలా చూస్తామో, వాటి గురించి అలాగే మాట్లాడతామని, ఆలోచనలను అలాగే ఉంచుకుంటామని అన్నారు. అందువల్ల ఆలోచనలను రాసి, విసిరివేయడం వల్ల వాటికి మనసులో విలువ తగ్గిపోతుందని, తద్వారా అవి దూరమవుతాయన్నారు. మూడు రకాల పరిశోధనల్లో వెల్లడైన వివరాల ద్వారా ఈ మేరకు మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.
No comments:
Post a Comment