Tuesday, November 27, 2012

తెలుగువారందరూ పాల్గొనవచ్చు.....

తెలుగు మహాసభలపై సాంస్కృతిక శాఖ


ప్రతినిధులు మాత్రమే రూ.500 చెల్లించాలి...
ఇతర రాష్ట్రాలవారి కోసం ప్రత్యేక రైళ్లు, బస్సులు

తిరుపతిలో డిసెంబర్ 27, 28, 29 తేదీలలో జరగనున్న 4వ ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగువారందరూ పాల్గొనవచ్చని రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి జి. బలరామయ్య తెలిపారు. ఈ మహాసభల్లో ఎలా పాల్గొనాలనే అంశంపై ప్రజల్లో సందేహాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రతినిధులుగా పాల్గొనదలిచిన వ్యక్తులు మాత్రమే రూ.500ల రుసుం చెల్లిం చాల్సి ఉంటుందని, మిగతావారికి ఎలాంటి రుసుం ఉండదని తెలిపారు. ప్రతినిధులుగా నమోదు worldteluguconference.com లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించామన్నారు. చివరి తేదీ డిసెంబర్ 7గా తెలిపారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బలరామయ్య మాట్లాడారు. మహాసభల కోసం 5 ఉప వేదికలు, 5 సెమినార్ హాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలుగు భాష ప్రావీణ్యం, సంస్కృతులపై సదస్సులు నిర్వహిస్తున్నట్లు, మహాసభల ప్రాంగణంలో 14 రకాల ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయనున్నట్లు బలరామయ్య వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి కోసం ప్రత్యేక రైళ్లు, బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సభల నిర్వహణకు రూ.45 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు.



 

No comments: