Thursday, October 4, 2012


వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. విద్యా, ఉద్యోగ రంగ్లాల్లోనే కాదు ఇంజినీరింగ్, టెక్నాలజీ వ్యాపార రంగంలోనూ ఇండియన్స్ ముందున్నారు. అగ్రరాజ్యంతో కొత్తగా కంపెనీలు పెడుతున్న ఇమ్మిగ్రెంట్స్‌లో భారతీయులే టాప్‌లో ఉన్నారని తాజా సర్వేలో తేలింది. వలసదారులు కంపెనీలు స్థాపించడం తగ్గుముఖం పట్టినా ఎన్నారైలే అగ్రస్థానంలో కొనసాగుతుండడం విశేషం.



2006-12 మధ్యకాలంలో అమెరికాలో కొత్తగా కంపెనీలు స్థాపించిన ఇమ్మిగ్రెంట్స్‌లో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారు. 33.2 శాతం మంది ఎన్నారైలు కంపెనీలు ఏర్పాటు చేశారు. 2005తో పోల్చుకుంటే ఇది ఏడు శాతం అధికం. జాతీయ స్థాయిలో ప్రవాసులు స్థాపిస్తున్న కొత్త కంపెనీ సంఖ్య 24.3 శాతానికి త గ్గింది. 2005 నాటికి ఇది 25.3 శాతంగా నమోదయింది. సిలికాన్‌వ్యాలీలో ఈ శాతం 52.4 శాతం నుంచి 43.9 శాతానికి పడిపోయిందని సర్వేలో వెల్లడయింది. కావుఫ్‌మాన్ ఫౌండేషన్ఈ సర్వే నిర్వహించింది. 32 పేజీల సర్వే నివేదికను కావుఫ్‌మాన్ ఫౌండేషన్విడుదల చేసింది.

దీని ప్రకారం కొత్తగా కంపెనీలు పెట్టిన విదేశీ వలసదారుల టాప్-10 జాబితాలో ఇండియా ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. భారత్(33.2 శాతం) తర్వాత చైనా(8.1), బ్రిటన్(6.3), కెనడా(4.2), జర్మనీ(3.9), ఇజ్రాయెల్(3.5), రష్యా(2.4), కొరియా(2.2), ఆస్ట్రేలియా(2), నెదర్లాండ్స్ (2 శాతం) ఉన్నాయి. ఎన్నారైలు కాలిఫోర్నియాలో అత్యధిక సంఖ్యలో(26 శాతం) కొత్త కంపెనీలు పెట్టారు. మసాచుసెట్స్‌ను 8 శాతం మంది ఎంపిక చేసుకున్నారు.

No comments: