|
Showing posts with label cinima. Show all posts
Showing posts with label cinima. Show all posts
Saturday, February 16, 2013
మూడు తరాల 'చిత్రం'!
మూడు తరాల 'చిత్రం'!
|
Tuesday, November 27, 2012
వంద కోట్ల క్లబ్
బాలీవుడ్లో వంద కోట్ల క్లబ్
అని హీరోహీరోయిన్లకు ఓ స్థాయి వుంది. వారి సినిమాలు వంద కోట్ల కలెక్షన్లు దాటితే ఆయా హీరోయిన్లను వందకోట్ల క్లబ్లో మెంబర్లుగా చేరుస్తారు. హీరోలు ఎందరు ఉన్నా హీరోయిన్లు ఎంతమంది ఉన్నారనేదే ప్రశ్న. ప్రియాంక చోప్రా, అసిన్, సోనాక్షిసిన్హా వంటి భామామణులే ఈ క్లబ్లో గుర్తింపు పొందారు. కరీనాకపూర్తో సమానంగా పారితోషికం తీసుకుంటున్నా కత్రినాకైఫ్కు మాత్రం ఈ క్లబ్లో చోటు దొరకలేదు. ఆ స్థానం ఎప్పుడు దక్కుతుందా అని ఎదురుచూసిన కత్రినాకు జబ్తక్ హైజాన్ చిత్రం వరంలా దొరికింది. ఈ చిత్రం వంద కోట్ల షేర్ దాటింది. ఈ విషయంపై అభిప్రాయం అడిగితే ఇది ఆరంభం మాత్రమేనని, గతంలో ఉన్నవాళ్లకి రెండుమూడు చిత్రాలు ఉంటే ఆ అంకెను తాను దాటేస్తానంటోంది ధీమాగా. చూద్దాం అది కూడా!
గిన్నీస్బుక్.....ఐటమ్ రికార్డు
Sunday, October 21, 2012
మీ ఫోన్.. వారి రక్తం!
కాంగోలో తీవ్రవాద ముఠాల దారుణ కాండ..
కుటుంబ సభ్యుల ఎదుటే అత్యాచారాలు, హత్యలు
బాలబాలికలతో వెట్టి చాకిరీ.
గనుల కోసమే ఆకృత్యాలు
ఆ లోహాలతో సెల్ఫోన్ సహా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ..
ఏడాదికి 900 కోట్లు..
అన్ని తీవ్రవాద కార్యకలాపాలకే!..
కాంగో నుంచి ఖనిజాలు కొనొద్దు: 'సేవ్ ది కాంగో'!
ఇంటర్నెట్లో విడుదల
మీరు కొన్న టాబ్లెట్ కంప్యూటర్ విలువెంతో తెలుసా..? కాంగో దేశంలో ఒక మహిళ మానం!? అదే మీ ల్యాప్టాప్ కోసం ఖర్చయ్యిందెంతో తెలుసా..? ఆ దేశంలో ఒక మనిషి ప్రాణం!? మనం కొంటున్న సెల్ఫోన్ విలువ.. ఆవిరవుతున్న ఒక బాల్యం..!? ఇంతేకాదు.. మనం కొనే ప్రతీ ఎలక్ట్రానిక్ వస్తువు వెనుకా.. కాంగో దేశ ప్రజల కన్నీరు ఉంటుంది. ఆ దేశంలో ఓ నేరంతో అది సంబంధాన్ని కలిగి ఉంటుంది.
Sunday, October 14, 2012
తెలుగును కాపాడుకోవాలి
సినీ నిర్మాత డి.రామానాయుడు
- ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారం
న్యూఢిల్లీ, న్యూస్లైన్: ‘దేశభాషలందు తెలుగు లెస్స...’ అని కృష్ణదేవ రాయలు తెలుగు భాషను కీర్తించారంటూ గొప్పగా చెప్పుకోవడం తప్ప మాతృభాషను కాపాడుకునేందుకు, సంస్కరించుకునేందుకు మనం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ నిర్మాత డా.డి.రామానాయుడు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని మావలంకర్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ఢిల్లీ తెలుగు అకాడమీ(డీటీఏ) 25వ వార్షికోత్సవంలో భాగంగా రామానాయుడిని డీటీఏ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు.
బూసాన్ చలనచిత్రోత్సవంలో ‘బర్ఫీ’కి జేజేలు
లండన్: ఆస్కార్ అవార్డుల రేసులో విదేశీ చిత్ర విభాగంలో పోటీపడుతున్న భారత చిత్రం ‘బర్ఫీ’ 17వ బూసాన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. దక్షిణ కొరియాలోని బూసాన్ సినీ ఆడిటోరియంలో ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం 4 వేల మంది ప్రేక్షకులు లేచి నిలబడి తమ కరతాళ ధ్వనులతో ‘బర్ఫీ’కి హర్షాతిరేకాలు తెలిపారు. ఈ సినిమా కోసం కేటాయించిన పాసులన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ‘బర్ఫీ’ నటీనటులు రణ్బీర్ కపూర్, ప్రియాంక చోప్రా ప్రేక్షకుల మధ్య కూర్చొని ఈ సినిమాను వీక్షించారు.
Thursday, October 11, 2012
Saturday, October 6, 2012
శ్రీదేవి రీఎంట్రీ అదిరింది
15 ఏళ్ల విరామం తర్వాత 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రంతో బహు భాషానటి శ్రీదేవి రీఎంట్రీ అదిరింది. సాధారణ గృహిణి పాత్రలో శ్రీదేవి అద్భుతంగా ఒదిగిపోయింది. ఎన్నాళ్లుగానో తెర మీద మళ్లీ శ్రీదేవిని చూడాలనుకుంటున్న అభిమానులకు ఆ ముచ్చట తీరింది. ఈ చిత్రంలో శశి (శ్రీదేవి) పాత్ర ఇంగ్లిష్ వింగ్లీష్ పాత్రకే పరిమితం కాకుండా.. భారత దేశంలో ప్రతి రోజు ఏదో ఒక క్షణంలో ఎవరో ఒకరు ఆంగ్ల భూతానికి బలవుతూ ఉన్నవారికి ప్రతిరూపంగా నిలిచింది. ఊరుకాని ఊరు.. దేశం కాని దేశంలో ఇంగ్లీష్ రాని వారి పరిస్థితి ఎలా ఉంటుందో శశి పాత్ర కళ్లకు కట్టినట్టు చూపించింది. ఫలితంగా ప్రతి ఒక్కరికీ ఆ పాత్ర అందరినీ అలరించడమే కాకుండా, శ్రీదేవికి ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం కలిగించింది.
Subscribe to:
Posts (Atom)






