Showing posts with label Environment. Show all posts
Showing posts with label Environment. Show all posts

Wednesday, November 21, 2012

ఇంధనం కోసం ఎన్ని తిప్పలో...!

బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయం ఒకటి గత ఏడాది మూత్రం ద్వారా తగు మోతాదులో ఇంధనాన్ని తయారుచేయడం సాధ్యమేనని నిరూపించింది.



ప్రపంచం సంప్రదాయేతర ఇంధనవనరుల కోసం అర్రులు జాస్తోంది.. బయోడీజిల్ తయారీ... వ్యర్థాల నుంచి మిథేన్ ఉత్పత్తి... అన్నీ ఇందులో భాగమే. అయితే ఈ జాబితాలోకి కొత్తగా చేరుతున్నదేమిటంటే... మూత్రం... వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల మనిషి సహజజీవక్రియలో భాగంగా వదిలించుకునే మూత్రాన్ని ఇంధనంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.



ప్రపంచ జనాభా దాదాపు 700 కోట్లు! అందరూ రోజూ లఘుశంక తీర్చుకోవాల్సిందే. నాసా జరిపిన అధ్యయనాల ప్రకారం ఒక్కో మనిషి సగటున రోజుకు దాదాపు 2.5 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. కొంతమోతాదులో యూరియా.... మరికొన్ని లవణాలు కలిగి ఉండే మూత్రం నేరుగా మురుగుకాలువలోకి కలిసిపోవడం వల్ల కొన్ని చిక్కులున్నాయి. నీరు కలుషితమవడం ఒకటైతే... యూరియాలోని అమ్మోనియా కారణంగా నీటివనరుల్లో నాచు పెరిగిపోతూంటుంది. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడంతోపాటు... మూత్రంలోని లవణాలను ఉపయోగించుకుని ఇంధనాన్ని సృష్టించేందుకు కొన్ని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. సుమారు దశాబ్దం క్రితం కొంతమంది శాస్త్రవేత్తలు ‘అనమాక్స్’ అనే ఓ బ్యాక్టీరియాను గుర్తించారు.



ఆక్సిజన్ అవసరం లేకుండా బతకగలిగే ఈ బ్యాక్టీరియాకు ఓ వినూత్న లక్షణం ఉంది. అమ్మోనియా... నైట్రేట్‌లను కలిపి నైట్రోజన్‌ను ఉత్పత్తి చేయగలదు. అదేసమయంలో హైడ్రోజనేస్ అనే ఒకరకమైన ఉదజని సంబంధిత ఇంధనాన్ని తయారుచేయగలదు. మూత్రంతోపాటు ఈ అనమాక్స్ బ్యాక్టీరియాను ఉపయోగించి ఇంధనాన్ని తయారుచేయవచ్చునని శాస్త్రవేత్తలు అప్పట్లో అంచనా వేశారు. అయితే అప్పటి టెక్నాలజీ ద్వారా ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం వీలుకాలేదు. ఇప్పుడు పరిస్థితి మారింది... బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయం ఒకటి గత ఏడాది మూత్రం ద్వారా తగు మోతాదులో ఇంధనాన్ని తయారుచేయడం సాధ్యమేనని నిరూపించింది. అమెరికాలోని ఒహాయో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మూడేళ్ల క్రితం ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారా మూత్రం నుంచి ఉదజనిని వేరు చేసి ఇంధనంగా వాడుకోవచ్చునని ప్రతిపాదించారు.



మూత్రం ద్వారా ఇంధనాన్ని తయారుచేసేందుకు ఒకవైపు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు సాగిస్తూండగానే ఆఫ్రికాలోని డ్యూరో ఐనా అడెబోలా, అకిన్‌డేలే అబియోలా, ఫలాకే ఒట్టువాటోయెన్, బెల్లో ఎనియోలా అనే నలుగురు టీనేజ్ యువతులు ఈ పనిని సాధించి చూపారు. ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారానే మూత్రంలోని యూరియా నుంచి ఉదజనిని వేరుచేసి... దాన్ని ఒక సిలిండర్‌లో నింపారు. ఈ వాయువుతో జనరేటర్‌ను నడిపి చూపారు కూడా. గత వారం నైజీరియాలో జరిగిన ఓ అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లో ఈ టెక్నాలజీ ప్రదర్శితమైంది.

Sunday, October 21, 2012

మీ ఫోన్.. వారి రక్తం!

కాంగోలో తీవ్రవాద ముఠాల దారుణ కాండ..

కుటుంబ సభ్యుల ఎదుటే అత్యాచారాలు, హత్యలు

బాలబాలికలతో వెట్టి చాకిరీ.

గనుల కోసమే ఆకృత్యాలు

ఆ లోహాలతో సెల్‌ఫోన్ సహా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ..

ఏడాదికి 900 కోట్లు..

అన్ని తీవ్రవాద కార్యకలాపాలకే!..

                                                             


                                                          
కాంగో నుంచి ఖనిజాలు కొనొద్దు: 'సేవ్ ది కాంగో'!


'బ్లడ్ ఇన్ మొబైల్' పేరిట లఘు చిత్రం.. 
  
ఇంటర్‌నెట్‌లో విడుదల

మీరు కొన్న టాబ్లెట్ కంప్యూటర్ విలువెంతో తెలుసా..? కాంగో దేశంలో ఒక మహిళ మానం!? అదే మీ ల్యాప్‌టాప్ కోసం ఖర్చయ్యిందెంతో తెలుసా..? ఆ దేశంలో ఒక మనిషి ప్రాణం!? మనం కొంటున్న సెల్‌ఫోన్ విలువ.. ఆవిరవుతున్న ఒక బాల్యం..!? ఇంతేకాదు.. మనం కొనే ప్రతీ ఎలక్ట్రానిక్ వస్తువు వెనుకా.. కాంగో దేశ ప్రజల కన్నీరు ఉంటుంది. ఆ దేశంలో ఓ నేరంతో అది సంబంధాన్ని కలిగి ఉంటుంది.

Friday, October 19, 2012

సాగరళం..


 హుస్సేన్ సాగర్ జలాశయంలో కాలుష్య స్థాయి ఆందోళన కలిగించే రీతిలో పెరిగింది. జలాశయంలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరగడంతో జలచరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వృక్ష, జంతు ప్లవకాలు, ఇతర జలచరాల మనుగడకు అత్యావశ్యకమైన ‘కరిగిన ఆక్సీజన్ (డీఓ)’స్థాయిపడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) మార్గదర్శకాల ప్రకారం ఈ జలాశయం అత్యంత కాలుష్యకాసారమైన ‘ఇ’ కేటగిరీ జలాశయంగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే కాలుష్య స్థాయి గణనీయంగా పెరిగి నట్లు పీసీబీ తాజా నివేదిక బట్టబయలుచేసింది. సెప్టెంబరులో గణేష్ నిమజ్జనానికి ముందు, ఆ తరవాత జలాశయంలో వివిధ కాలుష్య ప్రమాణాల స్థాయిలను తాజా నివేదికలో పొందుపరిచారు. జాతీయ నీటి నాణ్యతా పర్యవేక్షణ కింద ఈ నివేదిక సిద్ధంచేసినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబరు 17కు ముందు, 26 నుంచి 29 తేదీల మధ్యన కాలుష్య ప్రమాణాల స్థాయిలను లెక్కించి ఈ నివేదికలో పేర్కొన్నారు. ఐదు ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించి పరిశోధించామన్నారు.



నీటి నమూనాలు స్వీకరించిన ప్రాంతాలివే..

ఎన్‌టీఆర్ పార్క్ ఎదురుగా(ప్లాట్‌ఫాం నెం.1, ప్లాట్‌ఫాం నెం.2), నక్లెస్‌రోడ్, లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్, బుద్ధవిగ్రహం (సాగరం నడిబొడ్డున ఉన్నది) ప్రాంతాల్లో నమూనాలు సేకరించారు

.

పీసీబీ నివేదిక వెల్లడించిన అంశాలివే..



నిమజ్జనానికి ముందు, ఆ తర్వాత జలాల గాఢత (పీహెచ్) విలువ 7.38 - 8.1 మధ్య ఉంది.



టీడీఎస్ (నీటిలో కరిగిన ఘన పదార్థాలు) విలువ లీటరు నీటికి 550 నుంచి 853 మి.గ్రా. ఉంది. లుంబినీ పార్క్ వద్ద అత్యధికంగా, బుద్ధవిగ్రహం వద్ద తక్కువగా నమోదైంది.



డీఓ పరిమాణం తగ్గడంతో జలచరాల మనుగడ ప్రశ్నార్థకమైంది.



కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడి) ఎన్‌టీఆర్ పార్క్-ప్లాట్‌ఫాం నెం.2 వద్ద లీటరు నీటికి 85 నుంచి 210 మి.గ్రా. పెరిగింది.



బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) స్థాయి.. లీటరు నీటికి లుంబినీ పార్క్ వద్ద అత్యధికంగా 20-90 మి.గ్రా. మధ్యనుంది.



సాగర్‌లో లీటరు నీటికి సీఓడీ స్థాయి 90-100 మి.గ్రా. ఉంది.



భారలోహాల స్థాయి లీటరు నీటికి 0.01 మి.గ్రా. నమోదైంది.



నిరుడు నిమజ్జనం కంటే ఈసారి కాలుష్య స్థాయి బాగా పెరిగింది.



సీపీసీబీ హుస్సేన్‌సాగర్‌ను ‘ఇ’ స్థాయి జలాశయంగా ప్రకటించింది.



సాగరం నడిబొడ్డున కాలుష్య స్థాయి తక్కువే.



జలాశయంలో నిమజ్జనమైన విగ్రహాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది 48 గంటల్లోగా తొలగించినట్లు ప్రకటించారు.

Thursday, October 11, 2012

తప్పంతా అమెరికాదే !

భూతాపోన్నతికి బాధ్యత వహించాలి 
- ఇంధన వనరులను విచ్చలవిడిగా వాడేస్తోంది

- చెట్లు ఎక్కువగా నాటితే కొంత ఉపశమనం
- జియో ఇంజనీరింగ్ వల్ల దుష్ర్పభావాలూ ఉన్నాయి
- జియో ఇంజనీరింగ్ నిపుణుడు ప్రొఫెసర్ విలియమ్‌సన్స్
Prof.williamsons
భూమి భగ్గుమంటోంది. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకంతో మనిషి తన మనుగడకే ముప్పు తెచ్చుకుంటున్నాడు. ఆలస్యంగానైనా ప్రకృతితో కలసి జీవిస్తేనే భవిష్యత్తు పచ్చగా ఉంటుందన్న ఆలోచన వస్తోంది. అయితే ఈ లక్ష్యాన్ని సహజపద్ధతుల్లో సాధించాలని కొందరు భావిస్తూంటే మరికొందరు జియో ఇంజనీరింగ్ వంటి కృత్రిమ పద్ధతులతో సాధించే ఆలోచన చేస్తున్నారు. ఇంతకీ భూ తాపోన్నతి తగ్గించేందుకు, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు మేలైన పద్ధతి ఏమిటి? ఇప్పటి పరిస్థితికి కారకులెవరు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు జియో ఇంజనీరింగ్ నిపుణుడు ఫిల్ విలియమ్‌సన్