Friday, February 15, 2013

I Love Telanganaa.... Sabitha Indra REddy


నేనూ తెలంగాణ వాదినే!
త్వరగా తేల్చాలని కేంద్రానికి చెప్పా.. సెల్యూట్ చేస్తే జంకాను
రాజకీయం ఒక ఊబి.. మునిగిపోవద్దంటే ఎత్తుకు పై ఎత్తులు వేయాల్సిందే!
సీఎం కావాలన్న ఆలోచన లేదు.. పోలీసు శాఖను 'సెట్' చేయాల్సి ఉంది

ఓ సాధారణ గృహిణి నుంచి.. రాష్ట్ర తొలి మహిళా హోంమంత్రిగా ఎదిగిన మహిళ.. సబితా ఇంద్రారెడ్డి. ఆమె.. తొలిసారిగా 'సెల్యూట్' ఎదుర్కొన్నప్పుడు కలిగిన భయం నుంచి... అసలు పోలీసుశాఖను 'సెట్' చేయాల్సి ఉందనే దాకా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు.

గృహిణి నుంచి హోంమంత్రిగా మారారు? ఎలా ఉంది?
జీవితంలో ఇది ఇంకో భాగం అనుకుంటున్నా. ఇంద్రారెడ్డి భార్యగా ఎప్పుడూ నాలుగ్గోడల మధ్యే ఉన్నా. అలాంటిదిప్పు డు హోంశాఖను నిర్వహిస్తున్నా. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పలేని శాఖ ఇది. విమర్శలకు ఎక్కువగా తావు ఉంటుంది. మొదట్లో టెన్షన్ పడ్డాను. ఇప్పుడు పర్వాలేదు. 

రాజకీయపు ఎత్తులు అలవడ్డాయా?
తప్పదు.. నేర్చుకోవాల్సిందే. రాజకీయం ఒక ఊబిలాంటిది బయటికి రాలేం. మునిగిపోవద్దంటే.. ఎత్తుకు పైఎత్తు వేయకతప్పదు. సహజంగా ఆడవాళ్లకు ఇబ్బందికరమైన పరిస్థితే. హోంమంత్రి అయిన మొదట్లో.. అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశాను. వాళ్లందరూ సీనియర్లు.. వచ్చి సెల్యూట్ చేస్తుంటే.. కొంత జంకినట్లు అనిపించింది. తర్వాత అలవాటైపోయింది. 

మీది ప్రేమ వివాహం కదా?
ఇష్టపడి చేసుకున్నాం. ఇంద్రారెడ్డి కుటుంబానికి మా నాన్నగారికి పరిచయం ఉండేది. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న సంబంధం చూడమని చెప్పారు. తర్వాత ఆయన తానే చేసుకోవాలనుకున్నారు. రెండేళ్లకు పెళ్లి జరిగింది. ఆ రెండేళ్లు మా మధ్య ఉత్తరాలు నడిచాయి. 

మరి మీరు టీడీపీ వైపెందుకు వెళ్లలేదు?
ఇంద్రారెడ్డి ఎన్టీఆర్ నాయకత్వాన్ని అభిమానించేవారు. ముందునుంచీ చంద్రబాబుతో విభేదాలు ఉండేవి. ఎన్టీఆర్ మ రణించాక కాంగ్రెస్ వైపు మళ్లారు. నాకైతే రాజకీయాల్లోకి రా వాలని ఉండేదికాదు. ఇంద్రారెడ్డి మరణించాక కొద్ది రోజులకే అటు టీడీపీ.. ఇటు కాంగ్రెస్.. వాళ్ల తరఫున రంగంలోకి దిగమని ఒత్తిడి చేశాయి. ఆ సమయంలో వైఎస్ మా ఊరికి వచ్చా రు. ఇంద్రారెడ్డి ఆశయం నిలబెట్టడానికి ఏదో ఒక దారి వెతుక్కోవాలనిపించింది. కాంగ్రెస్ వైపే మొగ్గాను. 

హోంశాఖ ఇచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు?
హోంశాఖ ఇచ్చిన సంగతి తెలిసిన వెంటనే వైఎస్ దగ్గరికి వెళ్లాను.'ఏమైందమ్మా' అన్నారు. ఈ శాఖ ఇచ్చారేంటన్నా అంటే.. 'చేస్తావులే' అన్నారు. ఎలా సాధ్యం అనేసరికి.. 'నేనున్నాను కదా' అనేశారు. 

పోలీసుశాఖలో ఇతరుల జోక్యం?
అలాంటిదేమీ లేదు. ఇతరుల జో క్యం ఉన్నా.. వారి పని వారిని చేయనిస్తున్నాం. డీఎస్పీల బదిలీల వంటివన్నీ డీజీపీ చేతిలోనే ఉంటాయి. కేసుల నమోదు విషయంగా ఎమ్మెల్యేల జోక్యాన్ని పట్టించుకోవద్దనే చె బుతున్నాం. ఎక్కడైనా కొన్ని స్టేష న్లలో అలా జరుగుతుండొచ్చు. 

హోంశాఖలో వివాదాలు?
కొంత బాధగానే ఉంటుంది. పోలీసుశాఖ అనేది క్రమశిక్షణ ఉండాల్సిన విభాగం. అలాంటివి జరగకుండా కఠినంగా 'సెట్' చేయాల్సి ఉంది. ఏఎస్పీ నవీన్‌కుమార్ విషయంలో నూ.. చర్యలు చేపట్టినా.. ఆయన ఆరోపణల్లో వాస్తవాలపై విచారణ జరుగుతోం ది. నవీన్ అడ్వొకేట్లు వచ్చి కలిసి నప్పుడు.. ఆధారాలుంటే ఇవ్వాలని చెప్పాను. 

ఎస్పీని కానిస్టేబుల్ బందీ చేసిన ఘటనపై?
కానిస్టేబుల్‌కు ఏదైనా ఇబ్బంది ఉన్నా.. ఆ వింగ్‌లో ఏదైనా ఉన్నా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. పట్టించుకోకపోతే... మాకు చెప్పొచ్చు. దానిపై చర్యలు తీసుకుంటాం. 

రాజశేఖరరెడ్డితో అనుబంధం?
ఇంద్రారెడ్డి మరణించినప్పుడు.. నేను ఆస్పత్రికి చేరుకున్నప్పుడే వైఎస్ కూడా వచ్చారు. కొద్ది రోజులకు మా ఊరు వచ్చి కలిశారు. వైఎస్ పాదయాత్ర తొలుత తాండూరు నుంచి ప్రా రంభిద్దామనుకున్నారు. కానీ, చేవెళ్లలో సభ నిర్వహించి.. తాం డూరు నుంచి పాదయాత్ర ప్రారంభించాలని కోరాను. మరునాడే వైఎస్ ఫోన్ చేసి.. చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దాంతో కొంత భయపడ్డా. మా దగ్గర వద్దు, అపశకునం అనుకుంటారన్నాను. 'అలా అంటే.. మీ దగ్గరే మొ దలు పెడతా. ఇక ప్రతీ కార్యక్రమం అక్కడే ప్రారంభిస్తా'నన్నా రు. నన్ను 'చేవెళ్ల చెల్లెమ్మ' అని నోరారా పిలిచేవారు. నాకు వారి కుటుంబంతో పెద్దగా పరిచయం లేదు. ఆస్తుల అటా చ్‌మెంట్ ఫైల్‌పై సంతకం చేసిన తర్వాత చాలా సేపు బాధపడ్డాను. జగన్‌తో పెద్దగా పరిచయం లేకపోయినా.. వైఎస్‌తో ఉన్న అభిమానంతో బాధేసింది. 

'కళంకిత' ఆరోపణలపై?
అలాంటి ఆరోపణలతో బాగా బాధేస్తుంది. మంత్రులం ఏ విధంగా కళంకితులం అయ్యామనేది మాకు తెలియదు. సీబీఐ వాళ్లు ఓఎంసీ విషయంలో స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. ఆ విషయంలో ఫైల్‌లో మేం ఏం పెట్టాం. అధికారి శ్రీలక్ష్మి ఏం మా ర్చారు అనేది చెప్పాం. ఆ ఫైల్‌పై నా ఆఫీసులోనే సంతకం పెట్టాను. కేవీపీగానీ, వైఎస్‌గానీ ఫలానా ఫైల్‌పై, ఫలానా చోటుకు వచ్చి సంతకం పెట్టాలని ఎప్పుడూ చెప్పలేదు. 

హోంశాఖపై మీ ముద్ర?
ఇంకా చేయాల్సి ఉంది. ఉన్న మూడేళ్లలో ఉద్యమాలతోనే సరిపోయింది. తెలంగాణవారిపైనే కాదు..ఆంధ్రా వారిపైనా కేసులు పెట్టాం. అది విధి నిర్వహణలో భాగం. తెలంగాణలోని పరిస్థితులు, ఆకాంక్షలు నాకు తెలుసు. 

కార్తీక్‌పై ఆరోపణలు?
అవన్నీ అవాస్తవం. కార్తీక్ మొదట్లో నాకు సపోర్ట్‌గా ఉం డడం కోసం వచ్చేవారితో మాట్లాడడం వంటివి చేసేవాడు. కా నీ, ఆరోపణలు రావడంతో ఎవరితోనూ మాట్లాడడం లేదు. కార్తీక్‌కు రాజకీయంగా ఎదగాలనే ఆలోచన ఉంది. అలాంటివాడు చెడ్డపేరు తెచ్చుకొనే పనిచేయడు. సినీ నటుడు కృష్ణుడు రెండుమూడు సార్లు కాలనీవాళ్లతో కలిసి.. నాదగ్గరికి వచ్చారు. ఉపసర్పంచ్ ఇబ్బంది పెడుతున్నారని, ఎమ్మార్వో, ఇన్స్‌పెక్టర్‌తో మాట్లాడాలని కోరారు. వారితో మాట్లాడి సాయం చే యాలని చెప్పాను. కానీ, కృష్ణుడు ఆరోపణలు చేశారు. 

ఆరోపణలు ఎందుకొస్తున్నాయి?
నన్ను విమర్శించలేక.. కార్తీక్‌ను టార్గెట్ చేసి ఉండొచ్చు. భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలని యత్నిస్తున్నాడు కాబట్టి, అడ్డుకునేందుకు ఎవరైనా యత్నిస్తుండొచ్చు. జగన్ పార్టీలో కి కార్తీక్ వెళతాడనేది అవాస్తవం. కార్తీక్ వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా పోటీచేస్తాడు. ఇక నేను ఇప్పటికే ఊహించనంత ఎత్తుకు ఎదిగాను. సీఎం కావాల న్న ఆలోచనేం లేదు. 

తప్పు చేయలేదు..
ఓఎంసీ ఫైల్‌పై నేను సంతకం చేసి పంపి న తర్వాత.. అందులోంచి 'క్యాప్టివ్' పదా న్ని తొలగించారు. ఫైనల్ జీవోను కూడా నాకు పంపలేదు. తర్వాత ఏపీఎండీసీకి ఇ చ్చిన భూమిని కూడా ఓఎంసీకి ఇచ్చేందు కు ప్రయత్నించారు. శ్రీలక్ష్మి రెండు సార్లు వ చ్చి ఆఫైల్‌పై సంతకం చేయాలని కోరారు. కానీ, అక్కడ పరిశ్రమ వస్తే.. ఏపీఎండీసీకి లాభమని గుర్తించి సంతకం పెట్టలేదు. అ ది ఆగిపోయింది. నా పరిధిలో నేను వ్యవహరించాను. తప్పు చేయలేదు కాబట్టే.. నాకు భయం లేదు. అప్పుడు ఏం చేసినా.. రాష్ట్రానికి మంచి చేస్తున్నాం అనే ఆలోచనతో చేశాం. పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్ర రెవెన్యూ పెరుగుతుంది, ఉపాధి పెరుగుతుందని ఆలోచించాం. 

హైదరాబాద్‌కు మచ్చ రావొద్దు
నేను తెలంగాణవాదినని ఉద్యమం చేస్తున్నవారందరికీ తెలుసు. కానీ, హోంమంత్రిగా నా పరిధిలో నేను వ్యవహరించాల్సి ఉంటుంది. తెలంగాణ త్వరగా రావాలని కోరుకుంటున్నా. బయోడైవర్సిటీ సదస్సును దృష్టిలో పెట్టుకోవాలని తెలంగాణవాదులకు విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ వచ్చినా హైదరాబా ద్ ఉండేది అందులోనే. అందుకే మచ్చపడకుండా చూసుకోవాలని కోరుతున్నా. వ్యక్తిగతంగా అందరినీ పిలిచి మాట్లాడుతాను. తెలంగాణమార్చ్‌లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశాను.


No comments: