Monday, February 11, 2013

నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా---Shashider Reddy


ప్రజా సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిర్మాణాత్మక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో ఆదివారం ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఢిల్లీలో ఉన్నా, సనత్‌నగర్‌లో ఉన్నా ప్రజా సమస్యలను విస్మరించ డం లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గం పురోభివృద్ధికి చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. ప్రజలు సమస్యలను తమ దృష్టి కి తీసుకువస్తే వాటి పరి ష్కారానికి కృషి చేస్తానన్నా రు. తాను మాటల మనిషిని కాదని, చేతలు చేసి చూ పుతానన్నారు. ఈ కార్యక్రమంలో శశిధర్‌రెడ్డి తనయు డు పురూరవరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పూర్ణానందం, గుంటి సత్యనారాయణ, నరేందర్, స్వామి, శ్రీనివాస్, రామ్మో హన్‌రావు, జయప్రకాశ్, కిరణ్మయి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 


అభివృద్ధి పనులు
బేగంపేట: బేగంపేట డివిజన్‌లోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు. బ్రాహ్మణవాడలో 17 లక్షల వ్యయంతో, ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో 21.50 లక్షలతో నిర్మిస్తున్న సీవరేజ్ పైప్‌లైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేసారు. కార్యక్రమంలో బేగం పేట,సనత్‌నగర్, రాంగోపాల్‌పేట కార్పొరేటర్లు మహేశ్వరి శ్రీహరి, అయూబ్‌ఖాన్, కిరణ్మయి కిశోర్ యూత్‌కాంగ్రెస్ నేతలు పురూరవ రెడ్డి, నరేష్, లలితాచౌహాన్, శ్వేత, నాయకులు సి.సత్యనారాయణ, గిరి, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.



శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని డిమాం డ్ చేస్తూ సాధన కమిటీ సభ్యులు టీడీపి నేత హనీఫ్ నాయకత్యంలో ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.



సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి



సనత్‌నగర్: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని వృద్ధిలోకి రావాలని శశిధర్‌రెడ్డి అన్నారు. సనత్‌నగర్ డివిజన్ అల్లావుద్దీన్ కోఠి, అశోక్‌కాలనీకి చెందిన 101 మంది లబ్ధిదారులకు ఆయన ఆదివారం దీపం పథకం కింద సిలిండర్లను అందజేశారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ అభివృద్ధిని వేగవంతం చేసి ప్రజ లకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌లు ఆయూబ్‌ఖాన్, కిరణ్మ యి, కాంగ్రెస్ నాయకులు లలితాచౌహాన్, ఆయా బస్తీ ల నేతలు అక్బర్, ఇబ్రహీం, అడ్డూ, ప్రమోద్, షాబాద్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బల్కం పేట్ డివిజన్ బాలయ్యనగర్‌లో 4.4 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆసిఫ్ అలీ, కుంటా శ్రీహరి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు

No comments: