Saturday, February 16, 2013

మూడు తరాల 'చిత్రం'!


తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, తన కుమారుడు నాగ చైతన్యలతో కలిసి నటించనున్నట్టు ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఈ ముగ్గురు కలిసి వెండి తెర పంచుకోనున్నారని వస్తున్న ఊహాగానాలకు నాగ్ తెర దించారు. తాము కలిసి నటించే సినిమా ఈ ఏడాది జూన్ నెలలో ప్రారంభం కానుందని తెలిపారు. తాను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ జ్యుయెలర్స్ దుకాణాన్ని విశాఖపట్టణంలో శనివారంనాడు-ఫిబ్రవరి 16న- నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ- అభిమానుల అభిలాష మేరకు తన తండ్రి, కొడుకు కలిసి నటించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. 

అక్కినేని త్రయం కలిసి నటించే సినిమా మూడు తరాల 'చిత్రం' అవుతుంది. మొదటి తరానికి చెందిన నాగేశ్వరరావు, రెండో తరానికి ప్రాతినిథ్యం వహిస్తున్న నాగార్జున, మూడో తరానికి చెందిన చైతన్య సిల్వర్ స్క్రీన్ పై మెరిస్తే ఇక అక్కినేని అభిమానులకు పండుగే. మూడు తరాలు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించిన ఘనత కూడా అక్కినేని కుటుంబానికే చెందుతుంది. ప్రస్తుతం తెలుగులో నడుస్తున్న మల్టీ స్టారర్ ట్రెండ్ తర్వాత మూడు తరాల దిశగా సాగేందుకు అడుగులు పడుతున్నాయనడానికి అక్కినేని త్రయం సినిమానే ఉదాహరణ. అయితే మూడు తరాలు హీరోలున్న ఫ్యామిలీలు చాలా తక్కువగా ఉండడంతో ఇటువంటి సినిమాలు అరుదుగా మాత్రమే వస్తాయనడంలో సందేహం లేదు. 

తెలుగు చిత్రసీమలో 'కుటుంబ' సినిమాలు కొత్తేంకాదు. గతంలో చాలా మంది హీరోలు తమ కొడుకులు, అన్నలు, తమ్ముళ్లు, మనవలు, మనవరాళ్లతో కలిసి సినిమాల్లో కనిపించిన సందర్భాలున్నాయి. పెద్ద ఎన్టీఆర్ తన కుమారుడు హరికృష్ణ, బాలకృష్ణతో నటించారు. సూపర్ కృష్ణ తన కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబులతో కలిసి పలు చిత్రాల్లో ఫ్యాన్స్ కు వినోదం పంచారు. అక్కినేని నాగేశ్వరరావు కూడా తన కుమారుడు నాగార్జున తో నటించారు. చిరంజీవి తన సోదరుడు నాగబాబుతో చాలా సినిమాల్లో సందడి చేశారు. అయితే పూర్తిస్థాయి మూడు తరాల సినిమా ఇప్పటివరకు రాలేదని చెప్పొచ్చు. ఆ లోటును అక్కినేని వంశం తీర్చనుంది. 

కథ దొరికితే కలిసి నటించేందుకు మూడు తరాలు నటులు సిద్ధపడుతుండడంతో ఈ ట్రెండ్ భవిష్యత్ లో మరింత విస్తరించనుంది. తన తండ్రి బాబాయ్ తో కలిసి నటించేందుకు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కొణిదెల వంశంలో నటన చిరంజీవి నుంచి ప్రారంభమయింది కాబట్టి పవన్ కళ్యాణ్ ను రెండో తరంగా పరిగణించాల్సివుంటుంది. అటు ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు రానా కూడా తాత, బాబాయ్ తో సినిమా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. 

ఇక టాలీవుడ్ లో కుటుంబ చిత్రాలకైతే కొదవే లేదు. ఇప్పుడున్న యువ హీరోలు తమ వంశంలో స్టార్ డమ్ వున్న తమ ముందువారితో నటించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. చాలా మంది ఇప్పటికే నటించారు. కృష్ణంరాజు-ప్రభాస్, నాగార్జున-సుమంత్, మోహన్ బాబు- విష్ణు-మనోజ్ కాంబినేషన్లు ఈ కోవకు చెందినవే. అయితే మూడు తరాల 'చిత్రం' అభిమానులకు ఇచ్చే ఆనందం అంతాఇంతా కాదనడంలో అతిశయోక్తి లేదెమో!

మూడు తరాల 'చిత్రం'!


తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, తన కుమారుడు నాగ చైతన్యలతో కలిసి నటించనున్నట్టు ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఈ ముగ్గురు కలిసి వెండి తెర పంచుకోనున్నారని వస్తున్న ఊహాగానాలకు నాగ్ తెర దించారు. తాము కలిసి నటించే సినిమా ఈ ఏడాది జూన్ నెలలో ప్రారంభం కానుందని తెలిపారు. తాను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ జ్యుయెలర్స్ దుకాణాన్ని విశాఖపట్టణంలో శనివారంనాడు-ఫిబ్రవరి 16న- నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ- అభిమానుల అభిలాష మేరకు తన తండ్రి, కొడుకు కలిసి నటించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. 

అక్కినేని త్రయం కలిసి నటించే సినిమా మూడు తరాల 'చిత్రం' అవుతుంది. మొదటి తరానికి చెందిన నాగేశ్వరరావు, రెండో తరానికి ప్రాతినిథ్యం వహిస్తున్న నాగార్జున, మూడో తరానికి చెందిన చైతన్య సిల్వర్ స్క్రీన్ పై మెరిస్తే ఇక అక్కినేని అభిమానులకు పండుగే. మూడు తరాలు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించిన ఘనత కూడా అక్కినేని కుటుంబానికే చెందుతుంది. ప్రస్తుతం తెలుగులో నడుస్తున్న మల్టీ స్టారర్ ట్రెండ్ తర్వాత మూడు తరాల దిశగా సాగేందుకు అడుగులు పడుతున్నాయనడానికి అక్కినేని త్రయం సినిమానే ఉదాహరణ. అయితే మూడు తరాలు హీరోలున్న ఫ్యామిలీలు చాలా తక్కువగా ఉండడంతో ఇటువంటి సినిమాలు అరుదుగా మాత్రమే వస్తాయనడంలో సందేహం లేదు. 

తెలుగు చిత్రసీమలో 'కుటుంబ' సినిమాలు కొత్తేంకాదు. గతంలో చాలా మంది హీరోలు తమ కొడుకులు, అన్నలు, తమ్ముళ్లు, మనవలు, మనవరాళ్లతో కలిసి సినిమాల్లో కనిపించిన సందర్భాలున్నాయి. పెద్ద ఎన్టీఆర్ తన కుమారుడు హరికృష్ణ, బాలకృష్ణతో నటించారు. సూపర్ కృష్ణ తన కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబులతో కలిసి పలు చిత్రాల్లో ఫ్యాన్స్ కు వినోదం పంచారు. అక్కినేని నాగేశ్వరరావు కూడా తన కుమారుడు నాగార్జున తో నటించారు. చిరంజీవి తన సోదరుడు నాగబాబుతో చాలా సినిమాల్లో సందడి చేశారు. అయితే పూర్తిస్థాయి మూడు తరాల సినిమా ఇప్పటివరకు రాలేదని చెప్పొచ్చు. ఆ లోటును అక్కినేని వంశం తీర్చనుంది. 

కథ దొరికితే కలిసి నటించేందుకు మూడు తరాలు నటులు సిద్ధపడుతుండడంతో ఈ ట్రెండ్ భవిష్యత్ లో మరింత విస్తరించనుంది. తన తండ్రి బాబాయ్ తో కలిసి నటించేందుకు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కొణిదెల వంశంలో నటన చిరంజీవి నుంచి ప్రారంభమయింది కాబట్టి పవన్ కళ్యాణ్ ను రెండో తరంగా పరిగణించాల్సివుంటుంది. అటు ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు రానా కూడా తాత, బాబాయ్ తో సినిమా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. 

ఇక టాలీవుడ్ లో కుటుంబ చిత్రాలకైతే కొదవే లేదు. ఇప్పుడున్న యువ హీరోలు తమ వంశంలో స్టార్ డమ్ వున్న తమ ముందువారితో నటించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. చాలా మంది ఇప్పటికే నటించారు. కృష్ణంరాజు-ప్రభాస్, నాగార్జున-సుమంత్, మోహన్ బాబు- విష్ణు-మనోజ్ కాంబినేషన్లు ఈ కోవకు చెందినవే. అయితే మూడు తరాల 'చిత్రం' అభిమానులకు ఇచ్చే ఆనందం అంతాఇంతా కాదనడంలో అతిశయోక్తి లేదెమో!

Friday, February 15, 2013

I Love Telanganaa.... Sabitha Indra REddy


నేనూ తెలంగాణ వాదినే!
త్వరగా తేల్చాలని కేంద్రానికి చెప్పా.. సెల్యూట్ చేస్తే జంకాను
రాజకీయం ఒక ఊబి.. మునిగిపోవద్దంటే ఎత్తుకు పై ఎత్తులు వేయాల్సిందే!
సీఎం కావాలన్న ఆలోచన లేదు.. పోలీసు శాఖను 'సెట్' చేయాల్సి ఉంది

ఓ సాధారణ గృహిణి నుంచి.. రాష్ట్ర తొలి మహిళా హోంమంత్రిగా ఎదిగిన మహిళ.. సబితా ఇంద్రారెడ్డి. ఆమె.. తొలిసారిగా 'సెల్యూట్' ఎదుర్కొన్నప్పుడు కలిగిన భయం నుంచి... అసలు పోలీసుశాఖను 'సెట్' చేయాల్సి ఉందనే దాకా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు.

గృహిణి నుంచి హోంమంత్రిగా మారారు? ఎలా ఉంది?
జీవితంలో ఇది ఇంకో భాగం అనుకుంటున్నా. ఇంద్రారెడ్డి భార్యగా ఎప్పుడూ నాలుగ్గోడల మధ్యే ఉన్నా. అలాంటిదిప్పు డు హోంశాఖను నిర్వహిస్తున్నా. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పలేని శాఖ ఇది. విమర్శలకు ఎక్కువగా తావు ఉంటుంది. మొదట్లో టెన్షన్ పడ్డాను. ఇప్పుడు పర్వాలేదు. 

రాజకీయపు ఎత్తులు అలవడ్డాయా?
తప్పదు.. నేర్చుకోవాల్సిందే. రాజకీయం ఒక ఊబిలాంటిది బయటికి రాలేం. మునిగిపోవద్దంటే.. ఎత్తుకు పైఎత్తు వేయకతప్పదు. సహజంగా ఆడవాళ్లకు ఇబ్బందికరమైన పరిస్థితే. హోంమంత్రి అయిన మొదట్లో.. అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశాను. వాళ్లందరూ సీనియర్లు.. వచ్చి సెల్యూట్ చేస్తుంటే.. కొంత జంకినట్లు అనిపించింది. తర్వాత అలవాటైపోయింది. 

మీది ప్రేమ వివాహం కదా?
ఇష్టపడి చేసుకున్నాం. ఇంద్రారెడ్డి కుటుంబానికి మా నాన్నగారికి పరిచయం ఉండేది. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న సంబంధం చూడమని చెప్పారు. తర్వాత ఆయన తానే చేసుకోవాలనుకున్నారు. రెండేళ్లకు పెళ్లి జరిగింది. ఆ రెండేళ్లు మా మధ్య ఉత్తరాలు నడిచాయి. 

మరి మీరు టీడీపీ వైపెందుకు వెళ్లలేదు?
ఇంద్రారెడ్డి ఎన్టీఆర్ నాయకత్వాన్ని అభిమానించేవారు. ముందునుంచీ చంద్రబాబుతో విభేదాలు ఉండేవి. ఎన్టీఆర్ మ రణించాక కాంగ్రెస్ వైపు మళ్లారు. నాకైతే రాజకీయాల్లోకి రా వాలని ఉండేదికాదు. ఇంద్రారెడ్డి మరణించాక కొద్ది రోజులకే అటు టీడీపీ.. ఇటు కాంగ్రెస్.. వాళ్ల తరఫున రంగంలోకి దిగమని ఒత్తిడి చేశాయి. ఆ సమయంలో వైఎస్ మా ఊరికి వచ్చా రు. ఇంద్రారెడ్డి ఆశయం నిలబెట్టడానికి ఏదో ఒక దారి వెతుక్కోవాలనిపించింది. కాంగ్రెస్ వైపే మొగ్గాను. 

హోంశాఖ ఇచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు?
హోంశాఖ ఇచ్చిన సంగతి తెలిసిన వెంటనే వైఎస్ దగ్గరికి వెళ్లాను.'ఏమైందమ్మా' అన్నారు. ఈ శాఖ ఇచ్చారేంటన్నా అంటే.. 'చేస్తావులే' అన్నారు. ఎలా సాధ్యం అనేసరికి.. 'నేనున్నాను కదా' అనేశారు. 

పోలీసుశాఖలో ఇతరుల జోక్యం?
అలాంటిదేమీ లేదు. ఇతరుల జో క్యం ఉన్నా.. వారి పని వారిని చేయనిస్తున్నాం. డీఎస్పీల బదిలీల వంటివన్నీ డీజీపీ చేతిలోనే ఉంటాయి. కేసుల నమోదు విషయంగా ఎమ్మెల్యేల జోక్యాన్ని పట్టించుకోవద్దనే చె బుతున్నాం. ఎక్కడైనా కొన్ని స్టేష న్లలో అలా జరుగుతుండొచ్చు. 

హోంశాఖలో వివాదాలు?
కొంత బాధగానే ఉంటుంది. పోలీసుశాఖ అనేది క్రమశిక్షణ ఉండాల్సిన విభాగం. అలాంటివి జరగకుండా కఠినంగా 'సెట్' చేయాల్సి ఉంది. ఏఎస్పీ నవీన్‌కుమార్ విషయంలో నూ.. చర్యలు చేపట్టినా.. ఆయన ఆరోపణల్లో వాస్తవాలపై విచారణ జరుగుతోం ది. నవీన్ అడ్వొకేట్లు వచ్చి కలిసి నప్పుడు.. ఆధారాలుంటే ఇవ్వాలని చెప్పాను. 

ఎస్పీని కానిస్టేబుల్ బందీ చేసిన ఘటనపై?
కానిస్టేబుల్‌కు ఏదైనా ఇబ్బంది ఉన్నా.. ఆ వింగ్‌లో ఏదైనా ఉన్నా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. పట్టించుకోకపోతే... మాకు చెప్పొచ్చు. దానిపై చర్యలు తీసుకుంటాం. 

రాజశేఖరరెడ్డితో అనుబంధం?
ఇంద్రారెడ్డి మరణించినప్పుడు.. నేను ఆస్పత్రికి చేరుకున్నప్పుడే వైఎస్ కూడా వచ్చారు. కొద్ది రోజులకు మా ఊరు వచ్చి కలిశారు. వైఎస్ పాదయాత్ర తొలుత తాండూరు నుంచి ప్రా రంభిద్దామనుకున్నారు. కానీ, చేవెళ్లలో సభ నిర్వహించి.. తాం డూరు నుంచి పాదయాత్ర ప్రారంభించాలని కోరాను. మరునాడే వైఎస్ ఫోన్ చేసి.. చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దాంతో కొంత భయపడ్డా. మా దగ్గర వద్దు, అపశకునం అనుకుంటారన్నాను. 'అలా అంటే.. మీ దగ్గరే మొ దలు పెడతా. ఇక ప్రతీ కార్యక్రమం అక్కడే ప్రారంభిస్తా'నన్నా రు. నన్ను 'చేవెళ్ల చెల్లెమ్మ' అని నోరారా పిలిచేవారు. నాకు వారి కుటుంబంతో పెద్దగా పరిచయం లేదు. ఆస్తుల అటా చ్‌మెంట్ ఫైల్‌పై సంతకం చేసిన తర్వాత చాలా సేపు బాధపడ్డాను. జగన్‌తో పెద్దగా పరిచయం లేకపోయినా.. వైఎస్‌తో ఉన్న అభిమానంతో బాధేసింది. 

'కళంకిత' ఆరోపణలపై?
అలాంటి ఆరోపణలతో బాగా బాధేస్తుంది. మంత్రులం ఏ విధంగా కళంకితులం అయ్యామనేది మాకు తెలియదు. సీబీఐ వాళ్లు ఓఎంసీ విషయంలో స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. ఆ విషయంలో ఫైల్‌లో మేం ఏం పెట్టాం. అధికారి శ్రీలక్ష్మి ఏం మా ర్చారు అనేది చెప్పాం. ఆ ఫైల్‌పై నా ఆఫీసులోనే సంతకం పెట్టాను. కేవీపీగానీ, వైఎస్‌గానీ ఫలానా ఫైల్‌పై, ఫలానా చోటుకు వచ్చి సంతకం పెట్టాలని ఎప్పుడూ చెప్పలేదు. 

హోంశాఖపై మీ ముద్ర?
ఇంకా చేయాల్సి ఉంది. ఉన్న మూడేళ్లలో ఉద్యమాలతోనే సరిపోయింది. తెలంగాణవారిపైనే కాదు..ఆంధ్రా వారిపైనా కేసులు పెట్టాం. అది విధి నిర్వహణలో భాగం. తెలంగాణలోని పరిస్థితులు, ఆకాంక్షలు నాకు తెలుసు. 

కార్తీక్‌పై ఆరోపణలు?
అవన్నీ అవాస్తవం. కార్తీక్ మొదట్లో నాకు సపోర్ట్‌గా ఉం డడం కోసం వచ్చేవారితో మాట్లాడడం వంటివి చేసేవాడు. కా నీ, ఆరోపణలు రావడంతో ఎవరితోనూ మాట్లాడడం లేదు. కార్తీక్‌కు రాజకీయంగా ఎదగాలనే ఆలోచన ఉంది. అలాంటివాడు చెడ్డపేరు తెచ్చుకొనే పనిచేయడు. సినీ నటుడు కృష్ణుడు రెండుమూడు సార్లు కాలనీవాళ్లతో కలిసి.. నాదగ్గరికి వచ్చారు. ఉపసర్పంచ్ ఇబ్బంది పెడుతున్నారని, ఎమ్మార్వో, ఇన్స్‌పెక్టర్‌తో మాట్లాడాలని కోరారు. వారితో మాట్లాడి సాయం చే యాలని చెప్పాను. కానీ, కృష్ణుడు ఆరోపణలు చేశారు. 

ఆరోపణలు ఎందుకొస్తున్నాయి?
నన్ను విమర్శించలేక.. కార్తీక్‌ను టార్గెట్ చేసి ఉండొచ్చు. భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలని యత్నిస్తున్నాడు కాబట్టి, అడ్డుకునేందుకు ఎవరైనా యత్నిస్తుండొచ్చు. జగన్ పార్టీలో కి కార్తీక్ వెళతాడనేది అవాస్తవం. కార్తీక్ వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా పోటీచేస్తాడు. ఇక నేను ఇప్పటికే ఊహించనంత ఎత్తుకు ఎదిగాను. సీఎం కావాల న్న ఆలోచనేం లేదు. 

తప్పు చేయలేదు..
ఓఎంసీ ఫైల్‌పై నేను సంతకం చేసి పంపి న తర్వాత.. అందులోంచి 'క్యాప్టివ్' పదా న్ని తొలగించారు. ఫైనల్ జీవోను కూడా నాకు పంపలేదు. తర్వాత ఏపీఎండీసీకి ఇ చ్చిన భూమిని కూడా ఓఎంసీకి ఇచ్చేందు కు ప్రయత్నించారు. శ్రీలక్ష్మి రెండు సార్లు వ చ్చి ఆఫైల్‌పై సంతకం చేయాలని కోరారు. కానీ, అక్కడ పరిశ్రమ వస్తే.. ఏపీఎండీసీకి లాభమని గుర్తించి సంతకం పెట్టలేదు. అ ది ఆగిపోయింది. నా పరిధిలో నేను వ్యవహరించాను. తప్పు చేయలేదు కాబట్టే.. నాకు భయం లేదు. అప్పుడు ఏం చేసినా.. రాష్ట్రానికి మంచి చేస్తున్నాం అనే ఆలోచనతో చేశాం. పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్ర రెవెన్యూ పెరుగుతుంది, ఉపాధి పెరుగుతుందని ఆలోచించాం. 

హైదరాబాద్‌కు మచ్చ రావొద్దు
నేను తెలంగాణవాదినని ఉద్యమం చేస్తున్నవారందరికీ తెలుసు. కానీ, హోంమంత్రిగా నా పరిధిలో నేను వ్యవహరించాల్సి ఉంటుంది. తెలంగాణ త్వరగా రావాలని కోరుకుంటున్నా. బయోడైవర్సిటీ సదస్సును దృష్టిలో పెట్టుకోవాలని తెలంగాణవాదులకు విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ వచ్చినా హైదరాబా ద్ ఉండేది అందులోనే. అందుకే మచ్చపడకుండా చూసుకోవాలని కోరుతున్నా. వ్యక్తిగతంగా అందరినీ పిలిచి మాట్లాడుతాను. తెలంగాణమార్చ్‌లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశాను.


Thursday, February 14, 2013

My Mustaches will warn me.... Kanumuri Bapiraju


మీసాలు నన్ను హెచ్చరిస్తాయి
తప్పు చేయొద్దని జగన్‌కు చెప్పా
సోనియా వల్లే రెండు సార్లు టీటీడీ చైర్మన్ పదవి

పదవిని నా అవసరాలకు వాడుకోను
ఉద్యోగులను రోజూ హెచ్చరిస్తుంటా
ఇక నుంచి కఠిన చర్యలు చేపడతాం

పెద్ద మీసాలతో గంభీరంగా కనిపించే రాజకీయవేత్త కనుమూరి బాపిరాజు. తన మీసాల వెనుక కథ దగ్గరి నుంచి, టీటీడీని ప్రక్షాళన చేయాల్సి ఉందనేదాకా తన మనసులోని విషయాలను బాపిరాజు, అన్నపూర్ణమ్మ దంపతులు నిర్మొహమాటంగా వెల్లడించారు. వారితో 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమం విశేషాలు... 

మీ మీసాల వెనుక కథేంటి?
నాకు కాలేజీలో చదువుతున్నప్పటి నుంచీ మీసాలు పెద్దగా ఉండేవి. ఈ మీసాలను తల్లిదండ్రులుగా భావి స్తా. అవెప్పుడూ.. నువ్వు ఫలనా వ్యక్తివి, పార్టీవాడివి, ఫలానా ఊరివాడివి, ఫలానా వ్యక్తుల స్నేహితుడివి అంటూ హెచ్చరిస్తుంటాయి. అందువల్ల తప్పు చేయడానికి అవకాశం ఉండదు. 

ఇప్పటివరకు మీసాలు ఎన్ని సార్లు తీశారు?
హెచ్చెస్సీ పరీక్షలు రాశాక.. తిరుపతిలో గుండు తీయించుకున్నాను. మీసాలు తీయడం అదే మొదటి సా రి. మా నాన్న ఆరోగ్యం బాగోలేనప్పుడు ఒకసారి తీశా ను. చిక్‌మంగళూరులో ఇందిరాగాంధీ పోటీ చేసినప్పుడు.. ఆమె ప్రధాని అయినప్పుడు... వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కావడం కోసం మొక్కుకుని, తీర్చుకున్నా. 

ఎక్సైజ్ మంత్రిగా వివాదం?
డిస్టిలరీలకు అనుమతి వివాదంలో నా తప్పేంలేదు. రామారావుగానీ, సీపీఐ, బీజేపీ వాళ్లుగానీ నేను అవినీతి కి పాల్పడ్డానని అనలేదు. బాధ్యత వహించాలనే డిమాం డ్ చేశారు. దాంతో నేనే రాజీనామా చేశా. చెన్నారెడ్డి హ యాంలో ఎక్సైజ్‌శాఖ ఇచ్చినా తీసుకోలేదు. కానీ విజయభాస్కర్‌రెడ్డి సీఎం అయ్యాక తప్పలేదు. 

రాజకీయాల్లో మీ ఆవిడ సహకారం?
స్థానికులకు ఏ సమస్య వచ్చినా అన్నపూర్ణమ్మ ముం దుంటుంది. నేను రాజకీయాల్లో బిజీగా ఉంటుండే వాడి ని. దాంతో ఎవరైనా రోగులకు సమస్య వస్తే.. ఆమే వారి ని స్వయంగా తీసుకెళ్లి వైద్యం చేయించేది. దీంతో ఆమెకు నియోజకర్గంలో పట్టు పెరిగింది. అన్నపూర్ణమ్మ: మేం చేసిన సహాయం వల్ల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ఆత్మీయత కనిపిస్తుంది. టీటీడీ చైర్మన్ పదవి వచ్చాక స్వయంగా వెళ్లడం తగ్గిపోయింది. ఏదైనా ఉంటే ఫోన్ ద్వారా వీలైనంత సహాయం చేస్తున్నాం. 

రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
తొలుత 1978లో నేను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాను. అప్పుడు మా నాన్న వచ్చి 'రాజకీయాలు పాడైపోయాయి. ప్రజలు అసహ్యించుకునే రోజులివి. నీ కు పదవి పిచ్చి పట్టిందేంట్రా' అని తిట్టారు. వినకపోవడంతో.. నా కాళ్లు పట్టుకున్నారు. కొందరు నాకు ఓటే స్తాం.. పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టారని ఆయనకు వివరించాను. 'ఇరుక్కుపోయాను, ఎలాగూ గెలవను.. తిరిగి ఇంటికి వచ్చేస్తా. ఈ సారికి వదిలేయండి' అని బతిమాలడంతో.. వెళ్లిపోయారు. కానీ 46 ఓట్లతో గెలిచాను. అలా అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను. ప్రస్తుతం.. రాజకీయ వ్యవస్థే అవినీతిలో కూరుకుపోయింది. 

రెండు సార్లు టీటీడీ చైర్మన్ అవకాశమెలా వచ్చింది?
పదవి కోసం ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు. అడగకుండానే సోనియా నాకు టీటీడీ చైర్మన్ అవకాశం ఇచ్చారు. నన్ను ఎంపిక చేయాలని సీఎం కిరణ్‌ను ఆదేశించారు. కిరణ్ దగ్గరికి వెళ్లినప్పుడు కూడా.. ఆ పదవికి ఏ బల మూ లేని నన్నెలా ఎంపిక చేశారని అడిగాను. టీటీడీ చైర్మన్ కావడానికి ప్రణబ్ సహకరించారనేది అవాస్తవం. 

రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు విషయం?
అప్పుడు కేంద్ర మంత్రులు చిదంబరం, బన్సల్ తదితరులు కలిసి.. 'దేవుడి ప్రతినిధిగా బాపిరాజుతో యూపీఏ తరఫున మొదటి ఓటు వేయిద్దాం' అని నిర్ణయించారు. వీహెచ్ సహా వచ్చినోళ్లందరినీ ఆగాలని కోరి మరీ.. నాతో వేయించారు. అలాగే.. ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడూ తొలి ఓటు వేయించడానికి నన్ను పిలిచారు. అయితే.. ఈ సారి బెంగాల్ ఎంపీ ఒకరు నా కన్నా ముందే వచ్చారు. 'తిరుపతి బాలాజీ' తరఫున నాతో తొలిఓటు వేయిస్తామని వా రు చెప్పడంతో.. ఆ ఎంపీ కాస్త ఘాటెక్కారు. 'బెంగాల్ కాళీమాత తరఫున నేనే ముందు ఓటేస్తా' అని పట్టుబట్టా రు. వీహెచ్, మరికొందరు చెప్పినా ఆ ఎంపీ వినలేదు. 'ప్రపంచంలో అందమైన దేవత కాళీమాత. ఆమె ప్రతినిధిగా నేనే మొదటి ఓటేస్తా' అన్నారు. అంతలో బన్సల్ కల్పించుకుని.. 'సరే ఎవర్నీ బాధపెట్టడం మాకిష్టం లేదు. మీరే ఓటేయండి' అన్నాక ఆ ఎంపీ వెనక్కుతగ్గారు. 

టీటీడీ విషయంలో అన్నీ నాన్చుతారనే విమర్శలు?
ఇప్పటివరకు ఎప్పుడూ లేనన్ని నిర్ణయాలు నా ఆధ్వర్యంలో తీసుకున్నాం. ఉద్యోగుల సమస్యలను కూడా ప ట్టించుకోవాలి కదా. అందుకే ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వచ్చాను. టీటీడీ చైర్మన్‌గా నన్ను ఎంపిక చేయగానే.. నేనేదో చేస్తానని అందరూ ఆశపెట్టుకున్నారు. దానికి తగ్గట్లుగా నేను వ్యవహరించక తప్పదు. నేనీ పదవిని వేరే పనుల కోసం ఉపయోగించుకోవడం లేదు. 

లడ్డూ నాణ్యత దారుణంగా ఉండడంపై?
అలాంటి వాటిని నియంత్రించడం కోసం లడ్డూలు తయారు చేసే ప్రదేశానికి స్వయంగా వెళ్లి పరిశీలించాను. నేను వచ్చిన మొదట్లో లడ్డూలు దొరకడం లేదన్నారు. ఆ కొరత తీర్చడంపై దృష్టి పెట్టాను. ఇటీవల నాణ్యతపైనా దృష్టిపెట్టాం. లడ్డూ తయారీ ప్రదేశం అత్యంత పరిశుభ్రంగా ఉండేలా శ్రద్ధ తీసుకున్నాం. వెంట్రుకలు పడకుండా పనిచేసేవారికి తలకు ఆర్పాన్లు పెట్టాం. 

టీటీడీ సిబ్బందిలో అంకిత భావం తగ్గిపోతోందేం?
సిబ్బందిలో చాలా వరకు మర్యాదగా మాట్లాడటం అలవర్చుకున్నారు. "మనకు జీతం ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఎక్కడినుంచో వస్తున్న భక్తుల సొమ్మే తింటున్నాం. పైగా వాళ్లను బాధపెడుతుంటాం'' అని రోజూ హెచ్చరిస్తుంటా. తిరుమల నుంచి తిరిగి వెళ్లేవారు నవ్వు మొహంతో కనిపిస్తే.. మేం బాగా పనిచేసినట్లే. 

చర్యలు తీసుకోకుండా బతిమాలడం ఎందుకు?
అన్యమత ప్రచారంపై ప్రమాణం చేయించడం, బతిమాలి పనిచేయించుకోవడం వంటివి కొంతవరకు తప్పే. కానీ, ఇప్పటి నుంచి పద్ధతి మార్చాల్సిన అవసరం ఉం ది. కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రధాన పూజారులు ప్రై వేటు వ్యక్తుల దగ్గరికి వెళ్లడం, వీఐపీలకు ఆశీర్వచనం ఇ వ్వడం వంటివి మార్చుకోవాల్సి ఉంది. టీటీడీలోని వ్యవహారాలన్నింటినీ పూర్తి నియంత్రణలోకి తీసుకువస్తాం. 

జగన్ పార్టీలోకి పిలుపు రాలేదా?
వైఎస్ మరణించాక జగన్ సీఎం కావాలని నేను కూడా కోరుకున్నా. ఆ తర్వాత కూడా పార్టీ వదలొద్దని చాలా సార్లు చెప్పాను. కొత్త పార్టీ ప్రస్తావన వచ్చినప్పు డు.. 'మీ నాన్న చివరి వరకు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ను వ్వు తప్పు చేయొద్దు. తొందరపడొద్దు'' అని గట్టిగా చెప్పాను. కానీ... 'నా వల్ల కాదు. పార్టీ పెడుతున్నా. 2014లో మీరు నా పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేయాలి' అన్నాడు. కానీ, నేను తిరస్కరించా. 'ప్రాణం పోయినా పార్టీని వదిలిపెట్టేవాడిని కాను. ఒకవేళ నా నియోజకవర్గంలో నేను ఓడిపోయే పరిస్థితి వచ్చినా సరే.. నీ పార్టీ తరఫున నిలబడను'' అని చెప్పేశాను. 

మీ లక్ష్యం ఏమిటి?
శ్రీవారి సేవకన్నా కోరుకునేదేమీ లేదు. మనసు విప్పి మాట్లాడుకోలేని రోజులివి. ఈ కార్యక్రమం ద్వారా మనసులోని మాటలు చెప్పి హృదయంలోని భారాన్ని తగ్గించుకునే అవకాశం కల్పించారు, కృతజ్ఞతలు.

Tuesday, February 12, 2013

My ambition is Delhi.... R.Krishnaiah


ఢిల్లీ వెళ్లాలనుంది!
లోక్‌సభకైనా, రాజ్యసభకైనా ఓకే
బీసీల్లో ఇంకా కులతత్వం వీడలేదు
తెలంగాణ కంటే బీసీల సమస్యలే ముఖ్యం
వైఎస్‌పై అభిమానంతోనే జగన్‌కు గౌరవం
-- బీసీ సంఘాల నేత ఆర్. కృష్ణయ్య

 విద్యార్థి సంఘం నాయకుడి నుంచి.. రాష్ట్రంలో బీసీలకు పెద్ద దిక్కుగా ఎదిగిన నేత ఆర్. కృష్ణయ్య. అమ్మే తనకు తొలిగురువు అనే దగ్గరి నుంచి.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించక తప్పదనే అం శం దాకా ఆయన తన అభిప్రాయాల విశేషాలు... 

మీ కుటుంబ నేపథ్యం?
మా తండ్రికి 140 ఎకరాల మాగాణి ఉండేది. మా గ్రామానికి పెద్ద కూడా. మా అమ్మే నాకు తొలి గురువు. చదువుకొమ్మని ప్రోత్సహించిందీ, నాలో పట్టుదలను పెంచింది కూడా ఆమెనే. వివేకానందుడు, బుద్ధుడు నాకు ప్రేరణ. ఇంటర్, డిగ్రీలో ఆర్ఎస్ఎస్‌లో ఉన్నాను. 

బీసీ నేతగా ఎలా ఎదిగారు?
ఉస్మానియా వర్సిటీలో చదువుతున్నప్పుడు విద్యార్థి నాయకుడిగా పనిచేశాను. ప్రతీ కాలేజీకి తిరిగి విద్యార్థులను సమీకరించేవాడిని. బీసీలను ఆర్గనైజ్ చేయడం అం త సులువు కాదు. మద్దతిచ్చేవారు పది మంది ఉంటే.. వెనకాల వ్యతిరేకించేవారు 50 మంది ఉంటారు. 

తెలంగాణ ఉద్యమానికి ఎందుకు దూరంగా ఉన్నారు?
ఈ ఉద్యమం ఇటీవల వచ్చింది. కానీ, దానికంటే ము ఖ్యమైనది బీసీల సమస్య. ఇప్పటికీ గ్రామాల్లో 40 శాతం బీసీ కులాల వారు.. ఎస్సీ ఎస్టీల కన్నా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ సమస్యకు రాజకీయ ఆలోచనలు ఉండవు. దీన్ని మధ్యలో వదిలేయలేను. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనేది కచ్చితంగా చెప్పలేం. కేసీఆర్‌ను ఉద్యమ నాయకుడిగా మాత్రం గౌరవిస్తా. 

బీసీల్లో కొన్ని కులాలను పట్టించుకోరని ఆరోపణలు?
అవి ఉద్యమానికి దూరంగా ఉన్నవాళ్లు చేసే ఆరోపణ లు మాత్రమే. బీసీల్లో అన్ని కులాల కోసం నేను పోరాడుతున్నా. నా వెంట గౌడ్‌లు, యాదవులు, ముదిరాజ్, మున్నూరు కాపులు ఎక్కువగా ఉంటుంటారు. మిగతా కులాలను నేను ఎప్పుడూ దూరం పెట్టను. కానీ, వారే రావడం లేదు. చైతన్యం తక్కువగా ఉండడమో, కులతత్వం ఇంకా వీడకపోవడమో దానికి కారణం కావొచ్చు. 

బీసీలను వర్గీకరించాలని అంటున్నారెందుకు?
బ్యాక్ వర్డ్, మోస్ట్ బ్యాక్‌వర్డ్‌లుగా చేయాలని కొందరు అంటున్నారు. కానీ, దానివల్ల నష్టమే జరుగుతుంది. అం దువల్ల బీసీలను.. 8 గ్రూపులుగా చేయాలని చెబుతు న్నాం. మరింతగా వికేంద్రీకరణ చేయగలిగితేనే.. అత్యం త వెనుకబడిన కులాలకు ప్రయోజనం కలుగుతుంది. 

రీయింబర్స్‌మెంట్‌తో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి?
ఇంజనీరింగ్ విద్య ప్రమాణాలను పెంచాలని, గ్రామీ ణ విద్యార్థులు ఇంగ్లీష్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించాం. మరిన్ని మార్పులు, సంస్కరణలు తీసుకురావాల్సి ఉంది. మొదట్లో నాకు ఈ లోతు తెలియదు. దీనిపై సీఎంకు, ఉన్నతాధికారులకు ప లు సూచనలు చేశాను. అయితే.. ఈ పథకానికి సరిగా నిధులు విడుదల చేయకపోవడం.. అనర్హుల పేరిట పథకానికి కోత పెట్టడాన్ని నిరసిస్తూ ఉద్యమం చేస్తున్నాం. 

బీసీ రిజర్వేషన్లపై చైతన్యం వచ్చిందా?
బీసీల్లో ఇటీవల రాజకీయ చైతన్యం పెరిగింది. పంచాయతీ రాజ్ రిజర్వేషన్ల వల్ల రెండో స్థాయి నాయకత్వం బలపడింది. జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ వచ్చింది. చెన్నారెడ్డి, ఎన్టీఆర్‌లకు బీసీల విషయంగా మంచి ఆలోచనలుండేవి. కోట్ల విజయభాస్కర రెడ్డి పంచాయతీరాజ్ రిజర్వేషన్లను పెంచారు. 

వైఎస్‌తో సన్నిహితత్వం ఎలా?
నేను ఆయనతో సన్నిహితంగా ఉండడం అనేకంటే.. ఆయనే నన్ను సన్నిహితం చేసుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తొలుత మూడేళ్లపాటు వైఎస్‌తో పోరాడాను. కానీ, నిరాహార దీక్ష చేస్తానన్నప్పుడు.. నన్ను పిలిపించి మాట్లాడారు. నేను చేసిన డిమాండ్లన్నింటినీ ఒప్పుకొన్నా రు. వైఎస్ రాజశేఖరరెడ్డి మీద ఉన్న అభిమానంతోనే ఆయన కుమారుడు జగన్‌ను గౌరవిస్తా అంతే. 

రక్షణ స్టీల్స్ వివాదం సంగతి?
దానికి సంబంధించి తొలుత నాకు పూర్తి వివరాలు తెలియవు. అనంతపురానికి చెందిన సంఘాలు నన్ను అప్పటికప్పుడు పిలిపించడంతో.. వెళ్లి మాట్లాడాను. అ లాంటి వాటిని వెంటనే సర్దుకున్నాను. వైఎస్ చేసిన మే లు వల్లే అలా చేశాననడం సరికాదు. బీసీ డిక్లరేషన్ ప్రకటించాక చంద్రబాబు దగ్గరికి అన్ని సంఘాలతో వెళ్లాం. సన్మానం చేశాం. అంతమాత్రాన ఆయనతో కలిపేస్తారా? 

చట్టసభల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా?
రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఒత్తిడి తీసుకొస్తే.. రిజర్వేషన్లు వస్తాయని ఆశ. అందుకే వైఎస్‌తో ప్రయత్నించాం. ఇవాళ కాకపోతే రేపు.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వక తప్పదు. 

ఎమ్మెల్యే అవాలనే ఆలోచన ఎందుకు లేదు?
నాకు మొదటి నుంచీ ఆ ఆలోచన లేదు. 1983లోనే ఎన్టీఆర్ టికెట్ ఇస్తానన్నారు. కానీ, నాది పేద ప్రజల కోసం చేసే పోరాటం. రాజకీయాల్లో చేరితే పోరాటాల్లో కమిట్‌మెంట్ పోతుంది. ఇప్పుడు ఏదైనా అవకాశం వ స్తే.. లోక్‌సభకో, రాజ్యసభకో వెళ్లాలని ఉంది. అది కూడా అన్ని పార్టీలూ కలిసి పంపితేనే! ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా వైఎస్ కూడా ఆఫర్ ఇచ్చారు. 

కాలేజీలు నెలనెలా 'సొమ్ము' ఇస్తాయని ఆరోపణలు?
అలాంటిదేం లేదు. వాళ్లంతట వాళ్లే ఇస్తామన్నా నేను తీసుకోలేదు. ఎవరైనా స్నేహితుల నుంచి మాత్రమే విరాళాలు తీసుకుంటాను. కాలేజీల నుంచి విరాళాలు తీసుకుంటే.. వాటికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతాను? 

మీరు సాధించదలచుకున్నది?
దోపిడీ, పీడన, వివక్ష లేని సమాజం కావాలి. రాజకీయ ప్రక్షాళన జరుగకుండా సమాజంలో మార్పు రాదు. చట్ట సభల్లో రిజర్వేషన్లు సాధించాలి. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను సాధించాలనేది నా తపన.

Monday, February 11, 2013

Gummadi Narsaiah Open Heart


రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
పేదలకోసం పాటుపడాలనే లక్ష్యంతో న్యూడెమోక్రసీలో చేరా ను. 1981లో సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచాను. 83లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాను. తర్వాత 1994లో మినహా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. మా ప్రాంతంలాగే.. మాది బాగా వెనుకబడ్డ కుటుంబం. నా నివాసం ఖమ్మం జిల్లా టేకులగూడెం. నాకు వారసత్వంగా వచ్చింది రెండెకరాల పొలం మాత్రమే. 

మరి అప్పట్లో చురుగ్గా ఉన్న పీపుల్స్‌వార్‌లో ఎందుకు చేరలేదు?
అప్పటికి పీపుల్స్‌వార్ ఇంకా యుద్ధపంథాలోనే ఉంది. న్యూడెమోక్రసీ మాత్రం అడవుల్లోంచి బయటకు వచ్చి, చట్టబద్ధం గా పోరాటం ప్రారంభించింది. రాజ్య వ్యవస్థతో పోరాడడం అయ్యేపనేనా? అనే ఆలోచనతో పాటు.. పోరాట సంస్థలకు మద్దతు ఉంటుందని న్యూడెమోక్రసీలో చేరాను. 

ఏ కార్యక్రమానికి వెళ్లాలన్నా పార్టీ అనుమతి కావాల్సిందేనా?
పార్టీలో క్రమశిక్షణతో పాటు స్వీయ కట్టుబాట్లు కూడా ఉంటా యి. ఏదైనా సమావేశానికి వెళ్లినా.. పార్టీ అనుమతి తీసుకోవాలి. ఆ కార్యక్రమంలో ఎలా ఉండాలనేదానిపైనా పార్టీ నియంత్రణలు ఉంటాయి. పార్టీతో పాటు వ్యక్తిగతంగా కూడా నష్టం జరుగకూడదనే ఈ విధానం. అలా ఉండడం వల్లే.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నెగ్గుకు రాగలుగుతున్నాం. ఇతరులకు మాకు మధ్య తేడాను జనం గుర్తించగలుతున్నారు. 

ఎంత పట్టున్నా.. మధ్యలో ఓటమి పాలయ్యారు కారణం?
రాజకీయంగా పరిస్థితులు మారిపోయాయి. ప్రజల్లో మాకు ఇమేజ్ ఉన్నప్పటికీ ఓడిపోయాం. కారణం డబ్బు, రాజకీయాలు. మమ్మల్ని ఓడించడానికి ఇతర పార్టీలు ఒక్కటయ్యాయి. కాంగ్రెస్ కూడా టీడీపీకి మద్దతిచ్చింది. ఒక సారి నియోజకవర్గాల పునర్విభజన కొంత దెబ్బతీసింది. 

మీకు ఎమ్మెల్యేగా వచ్చిన వేతనం, అలవెన్సులు పార్టీకే ఇచ్చారా?
నాకు ఎమ్మెల్యేగా వచ్చేదంతా.. ఇప్పుడు పెన్షన్‌తో సహా పార్టీకే ఇచ్చేస్తాం. నేను తిరగడానికి, మా ఇంటి ఖర్చులకు పార్టీ ఇస్తుంది. ఎక్కడికైనా వెళితే.. వాహనాల డీజిల్, తిండి ఖర్చులు సహా పార్టీకి లెక్కచెబుతాం. ఇంట్లో వ్యక్తిగత ఖర్చులకు వ్యవసాయమే దిక్కు. 

నిజాయితీకే మా మద్దతు!
ఇప్పటికీ వ్యవసాయమే జీవనాధారం
బలవంతపు వసూళ్లు అవాస్తవం
పార్టీలన్నీ కలిసి ఓడించాయి
ఓ కబ్జాకు సంబంధించి పీజేఆర్ ఆఫర్ ఇచ్చాడు

మీకు ఎవరూ డబ్బు ఆఫర్ చేయలేదా?
ఒకసారి తన సస్పెన్షన్ గొడవకు సంబంధించి.. హౌజింగ్ బోర్డు ఏఈ డబ్బు తీసుకొచ్చాడు. ఇంట్లోకి వచ్చి కొద్దిసేపు మాట్లాడాడు. నాకు విషయం చెప్పకుండా అక్కడో కవరు పెట్టి, నా భార్యకు చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత అవి తీసుకెళ్లి ఇచ్చేసి.. మళ్లీ అలా చేయొద్దని హెచ్చరించి వచ్చాను. మరోసారి ఆయనే ప్రజల డబ్బు కాజేశాడు. దానిపై నేను ఫిర్యాదు చేస్తే.. సస్పెండయ్యా డు. కొద్ది రోజులకు యూనియన్ నేతలతో కలిసి వచ్చి.. రెండు లక్షలు ఇస్తా, ఫిర్యాదు వెనక్కితీసుకోవాలని కోరాడు. వాళ్లందరినీ తిట్టి పంపించాను. నిజాయితీగా ఉండడానికి నా భార్య మద్దతు ఎక్కువ. అక్రమంగా సంపాదించే డబ్బు మనకు వద్దని చెబుతుం ది. మా పిల్లలూ అక్రమాలను సహించరు. 

మీపై ఎప్పుడైనా ఒత్తిళ్లు వచ్చాయా?
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ కబ్జాకు సంబంధించి.. నేను అసెంబ్లీలో ప్రశ్న లేవనెత్తాను. అప్పుడు మంత్రిగా ఉన్న పి. జనార్దన రెడ్డి.. దానిని వెనక్కి తీసుకోవాలని కోరారు. అది తన పరిధిలోకి వస్తుందని, తాను చూసుకుంటానన్నారు. ఏదైనా ఉంటే మాట్లాడుకుందామని ఆఫర్ చేశారు. నేను పట్టించుకోలేదు. చిత్రమేమిటంటే.. మరుసటిరోజు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన మంత్రిని సభకు రాకుండా చేశారు. 

ఖమ్మంలో మీ పార్టీపై 'వసూళ్ల' ఆరోపణలేమిటి?
అలాంటి ఆరోపణలేవీ మా దృష్టికి రాలేదు. ఏడాదికోసారి కూలీలు, రైతుల నుంచి చందాలు మాత్రం తీసుకుంటాం. మా పార్టీకి విరాళం ఇవ్వాల్సిందిగా.. ఆ ప్రాంతంలో పనులు చేసే కాం ట్రాక్టర్లను అడుగుతుంటాం. అంతేగానీ బలవంతమేమీ ఉండదు. కానీ, వసూళ్ల ముద్రవేసి కాంట్రాక్టర్లు మా దగ్గర పనులను ఆపేశా రు. దానికి కారణం కొందరు మంత్రుల బెదిరింపులు.. వాళ్లకు సం బంధించిన వాళ్లకు పనులు దక్కాలని ఇలాంటి పని చేస్తున్నారు. 

మొదట్లో తెలంగాణను వ్యతిరేకించి ఇప్పుడు మద్దతిస్తున్నారేం?
మాకంటే ముందు మావోయిస్టు పార్టీ తెలంగాణ ఇవ్వాలని కోరింది. ఇప్పుడు జనశక్తికి జనం లేరు. మావోయిస్టులు బయటికి రాలేరు. అందువల్ల వారికి మద్దతుగా మా పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నాం. మొదట్లో కూడా మేం తెలంగాణను వద్దనలేదు.

నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా---Shashider Reddy


ప్రజా సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిర్మాణాత్మక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో ఆదివారం ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఢిల్లీలో ఉన్నా, సనత్‌నగర్‌లో ఉన్నా ప్రజా సమస్యలను విస్మరించ డం లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గం పురోభివృద్ధికి చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. ప్రజలు సమస్యలను తమ దృష్టి కి తీసుకువస్తే వాటి పరి ష్కారానికి కృషి చేస్తానన్నా రు. తాను మాటల మనిషిని కాదని, చేతలు చేసి చూ పుతానన్నారు. ఈ కార్యక్రమంలో శశిధర్‌రెడ్డి తనయు డు పురూరవరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పూర్ణానందం, గుంటి సత్యనారాయణ, నరేందర్, స్వామి, శ్రీనివాస్, రామ్మో హన్‌రావు, జయప్రకాశ్, కిరణ్మయి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 


అభివృద్ధి పనులు
బేగంపేట: బేగంపేట డివిజన్‌లోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు. బ్రాహ్మణవాడలో 17 లక్షల వ్యయంతో, ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో 21.50 లక్షలతో నిర్మిస్తున్న సీవరేజ్ పైప్‌లైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేసారు. కార్యక్రమంలో బేగం పేట,సనత్‌నగర్, రాంగోపాల్‌పేట కార్పొరేటర్లు మహేశ్వరి శ్రీహరి, అయూబ్‌ఖాన్, కిరణ్మయి కిశోర్ యూత్‌కాంగ్రెస్ నేతలు పురూరవ రెడ్డి, నరేష్, లలితాచౌహాన్, శ్వేత, నాయకులు సి.సత్యనారాయణ, గిరి, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.



శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని డిమాం డ్ చేస్తూ సాధన కమిటీ సభ్యులు టీడీపి నేత హనీఫ్ నాయకత్యంలో ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.



సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి



సనత్‌నగర్: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని వృద్ధిలోకి రావాలని శశిధర్‌రెడ్డి అన్నారు. సనత్‌నగర్ డివిజన్ అల్లావుద్దీన్ కోఠి, అశోక్‌కాలనీకి చెందిన 101 మంది లబ్ధిదారులకు ఆయన ఆదివారం దీపం పథకం కింద సిలిండర్లను అందజేశారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ అభివృద్ధిని వేగవంతం చేసి ప్రజ లకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌లు ఆయూబ్‌ఖాన్, కిరణ్మ యి, కాంగ్రెస్ నాయకులు లలితాచౌహాన్, ఆయా బస్తీ ల నేతలు అక్బర్, ఇబ్రహీం, అడ్డూ, ప్రమోద్, షాబాద్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బల్కం పేట్ డివిజన్ బాలయ్యనగర్‌లో 4.4 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆసిఫ్ అలీ, కుంటా శ్రీహరి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు